NRI’s Donation to Janasena : జనసేన పార్టీకి మద్దతుగా చాలామంది ప్రజలు ముందుకు వచ్చారు. వైసిపి ఆధ్వర్యంలో తము అనుభవహిస్తున్న బాధలు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీరుతుందని నమ్మకం ప్రజల్లో నిలువెల్లా ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలు వారాహి యాత్ర నిర్వహించి ప్రజల్లో తన ముద్రను వేశారు.
చాలా మంచి స్పందన అశేష జనవాహి హాజరవడం జరిగాయి. ఇంకా జనసేన పార్టీకి మద్దతుగా ఎన్నారై ఐరోపా విభాగానికి సంబంధించిన వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. వీరిని ఆత్మీయంగా కలవడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నారైలు పార్టీపై నా తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ మనుగడ కోసము, అభివృద్ధి కోసము, తమ వంతు సాయంగా విరాళాలను సమర్పించారు.
వివరాల్లోకి వెళ్తే ఎన్.ఆర్.ఐ. జనసేన ఐరోపా విభాగానికి చెందిన పలువురు ప్రవాసాంధ్రులు ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి పార్టీకి రూ.1.30 కోట్లు విరాళం అందించిన విషయం తెలిసిందే. వీరంతా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి నాయకత్వంలో, ఆస్ట్రేలియా కన్వీనర్ కొలికొండ శిశిధర్ సమన్వయంలో పార్టీ అధినేతను కలిసి చెక్కుల రూపంలో ఈ మొత్తాన్ని అందజేశారు. పార్టీ సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందించారు.