Pawan Kalyan : తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన నటన ఎప్పటికీ మరువలేము. ఆయన చిరస్మరణీయులు. చరిత్రలో నిలిచిపోయినటువంటి మనిషి. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ గారు రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు.
చరిత్ర మరువని నటనా కౌశలం.తెలుగు నుడికారంపై మమకారం.పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికారం కైవసం. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు శ్రీ నందమూరి తారక రామారావు గారు అనీ పవన్ కళ్యాణ్ రామారావు గారిని ప్రశంసించారు. ఆయన శత జయంతి సందర్భాన అంజలి ఘటిస్తున్నాను.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది. ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం.
తెలుగువారి సత్తాను రామారావు గారు ఢిల్లీ దాకా చాటారు. అని ఆయన తెలుగు ప్రజలకు చేసిన కృషిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ ఎన్.టి. రామారావు గారు తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.