Pawan Kalyan : ప్రజల శ్రేయస్సు, కోరి ప్రజా సమస్యలను తీర్చే దిశగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ నభూతో నభవిష్యత్ అనేలా జనసేన వారాహి విజయయాత్ర ఘనంగా మొదలయ్యింది. మొదట అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు స్వీకరించిన పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం వారాహి రథంలో తొలి అడుగు మోపారు. భారీ జనసంద్రోహం మధ్య వారాహి యాత్ర విజయోత్సహంతో మొదలయింది.
ఊహించిన దానికంటే రెట్టింపు అశేషజన సంద్రోహం వారాహి లో వస్తున్న పవన్ కళ్యాణ్ ని చూడడానికి పోటెత్తడంతో వారాహి రధాన్ని కత్తిపూడి సభా ప్రాంగణానికి ముందుగానే ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభిమానుల విజయోత్సవాల ధ్వనుల మధ్య పవన్ కళ్యాణ్ సాయంత్రం అన్నవరం నుంచి భారీ ర్యాలీగా కత్తిపూడి కి బయలుదేరారు. ఈ సందర్భంగా అన్నవరంలో వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు, పార్టీ, నాయకులు ఘన స్వాగతం పలికారు.
వారాహి రథంపై సమరశంఖం పూరించడానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఆడపడుచులు హారతులు పట్టి ఆహ్వానం పలుకగా… అన్నవరం నుంచి కత్తిపూడి వరకు వందలాది బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారికి ఇరువైపులా బారులు తీరిన జనసైనికులు దారి పొడుగునా పార్టీ జెండాలు రెపరెపలాడిస్తూ స్వాగతం పలికారు. కత్తిపూడి సభా ప్రాంగణం వద్ద సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలకడమే కాక
వంతెన పైనుండి అభిమానులు పూల వర్షం కురిపించడంతో పవన్ కళ్యాణ్ తడిసి ముద్దయ్యారు. అధినేత రాకను సూచిస్తూ పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చారు. మధ్యాహ్నం నుంచే వేదిక వద్ద మోత మోగించిన కేరళా డప్పు, నృత్య కళాకారులు జనసేనానిని ఆహ్వానించారు. అనంతరం అచ్చ తెలుగు సంప్రదాయంలో
మంగళవాద్యాల నడుమ సుమారు 50 మంది ఆడపడుచులు గుమ్మడి కాయలతో హారతులు పట్టి పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తీసి వారాహి వైపు దారి చూపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కదిలిన జనసేనానికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆడపడుచుల ఆత్మీయ స్వాగతాన్ని స్వీకరించిన ఆయన వేలాది మంది జనసైనికుల కేరింతల మధ్య వారాహి రథాన్ని అధిరోహించారు.
పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సభా ప్రాంగణానికి తరలివచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నియోజవకర్గాల ఇంచార్జులు, రాష్ట్ర, జిల్లాల కార్యవర్గ సభ్యులు తరలి వచ్చి జనసేన వారాహి విజయయాత్ర తొలి అడుగు ఘనంగా వేసేలా తమ వంతు కృషి చేశారు.