Pawan Kalyan Varahi Yatra : జనసైనికులకు గుడ్ న్యూస్, వారాహి 2.0 రెడీ.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి ఏపీలో ఊహించని క్రేజ్ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టడం వల్లే అధికారపార్టీ చేస్తున్న అవినీతి, అరాచకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. దీనితో జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తారాస్థాయికి చేరింది.
ప్రజల్లో ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత ఏర్పడింది అన్నా, అవినీతి గురించి ప్రజలకు స్పష్టంగా అర్థం అయింది అన్నా అది పవన్ చేపట్టిన వారాహి యాత్ర వల్లే అనేది బహిరంగ రహస్యం. వారాహి యాత్రకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి యాత్ర చేపట్టనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 27 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 2.0 ప్రారంభిస్తారట. ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మొదటి దశలో 10 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈసారి పవన్ కళ్యాణ్.. జనసేన నాయకులు, సైనికుల్లో ఉత్సాహం నింపే విధంగా ప్రసంగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే విధంగా అధికార పార్టీ చేసిన అవినీతిని డిటైల్డ్ గా ఎండగట్టే విధంగా పవన్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారట. జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా పవన్ దిశా నిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
టిడిపి, బిజెపి, జనసేన నిర్వహించే ఉమ్మడి సభల్లో పాల్గొంటూనే పవన్ వారాహి యాత్ర నిర్వహించబోతున్నట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. త్వరలో పవన్ వారాహి యాత్ర గురించి జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.