Rajamouli : RRR లో ఆమె చనిపోవాల్సింది, బాంబు పేల్చిన రాజమౌళి.. అలా చేసి ఉంటే సినిమా పోయేదిగా..
రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దాదాపుగా చాలా చిత్రాలన్నీ స్క్రిప్ట్ దశలు చాలా వర్షన్ లు మారుతుంటాయి. చివరికి దర్శకుడు రచయిత, ఇతర యూనిట్ అభిప్రాయాల మేరకు బెస్ట్ అని భావించిన వెర్షన్ ని చిత్రీకరిస్తారు.
అదే విధంగా ఎడిటింగ్ దశలో కూడా చాలా మార్పులు జరుగుతుంటాయి. అనవసర సన్నివేశాలని తొలగిస్తుంటారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడిగా జెన్నిఫర్ పాత్రలో ఒలీవియా మోరిస్ నటించింది.
మొదట అనుకున్న వర్షన్ లో జెన్నీ పాత్ర చనిపోతుందట. క్లైమాక్స్ పోరాట సన్నివేశానికి ముందు జెన్నీ చనిపోతుందట. జైలు రహస్యాలని జెన్నీ ఎన్టీఆర్ కి లీక్ చేస్తుంది. అది స్కాట్ కి తెలిసిపోతుంది. ఆమెని అడ్డు పెట్టుకుని చరణ్, ఎన్టీఆర్ లని అరెస్ట్ చేయాలని స్కాట్ భావిస్తాడు.
ఎన్టీఆర్, చరణ్ అరెస్ట్ అయిన తర్వాత జైలు రహస్యాలు లీక్ చేసింది అనే కోపంతో స్కాట్ ఆమెని చంపేస్తాడు. ఈ సన్నివేశాలన్నీ పెడితే సినిమా నిడివి చాలా ఎక్కువ అయిపోతోంది. అందువల్ల ఆమె మరణించే వర్షన్ ని మార్చేసి ఇప్పుడు ఉన్న వర్షన్ కి తీసుకువచ్చాం అని రాజమౌళి పెద్ద బాంబే పేల్చారు.
ఒక వేళ జెన్నీ పాత్ర మరణించే వర్షన్ చిత్రీకరించి ఉంటే సినిమా ఫ్లాప్ అయి అయినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి రాజమౌళి మంచి డెసిషన్ తీసుకున్నారు అని ఫ్యాన్స్ అంటున్నారు.