Samantha: స్టార్ హీరోయిన్ సమంత తాను కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న ఫొటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఇటీవల సామ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
తన హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ప్రేమికుల రోజున ఆసక్తికర పోస్ట్ చేసిన సామ్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. జీవితంలో ఎవరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో మీకు ఎప్పటికీ తెలియదు. అందుకే ఎప్పుడూ కాస్త దయతో ఉండండి” అంటూ రాసుకొచ్చింది.
సామ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సమంత నటించిన శాకుంతలం ఈ నెల 17 విడుదల కావాల్సి ఉండగా ఏప్రిల్ 14కు మార్చారు. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించిన విషయం తెలిసిందే. మరోవైపు సామ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి షూటింగ్ లో పాల్గొననుంది.
Discussion about this post