Street Dogs Attack:మరో ఘోరం… కుక్కల దాడిలో పసికందు మృతి
హైదరాబాద్ అంబర్ పేట్ లో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో అంత్యంత అమానుషంగా చనిపోయిన ఘటన మరువకముందే,మరో చిన్నారి కుక్కల దాడిలో చనిపోయిన హృదయావిదారక ఘటన జరిగింది. అయితే ఇది జరిగింది రాజస్థాన్ లో.అదికూడా ముక్కుపచ్చలారని పసికందు కావడం అంత్యంత బాధాకరం
రాజస్థాన్ లోని ఒక నెల వయసు మాత్రమే ఉన్న చిన్నారిని వీధి కుక్కలు కిరతకంగా కొరికి చంపేసాయి.సిరోహి జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి తన పసికందుతో పడుకొని నిద్రిస్తున్న సమయంలో, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేని సమయంలో ఆ పసికందును, రెండు కుక్కలు నోటితో భయటికి ఈడ్చుకెళ్లాయి.మధ్యలో మెలకువ వచ్చిన తల్లికి పసికందు కనబడలేదు.భయటకి వచ్చి చూడగా కుక్కలు కరుస్తుండటం కంటపడింది.పసికందు నుండి కుక్కలని తరిమేసినా, ఆ బిడ్డని ప్రాణాలతో కాపాడుకోలేక పోయింది ఆ తల్లి