YS Jagan : ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్తో సజ్జన్ జిందాల్ భేటీ.
జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్తో తాడేపల్లి నివాసంలో సమావేశమయ్యారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతరత్రా అంశాలపై ఇరువురు చర్చించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ ప్రగతిని ముఖ్యమంత్రికి సజ్జన్ జిందాల్ వివరించారు.
Pawan Kalyan Contest from Kakinada? : ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఎక్కడినుండో తెలుసా..!
జనవరి నుంచి ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్లో ఈప్లాంటు కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని జిందాల్ పేర్కొన్నారు. వెనకబడ్డ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని పోత్సహిస్తున్నామని, పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం అన్నారు.
విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధికోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని జిందాల్ సీఎంకు వెల్లడించారు. వచ్చే నెలలో దీని శంకుస్థాపకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. సౌరవిద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని జిందాల్ సీఎంకు తెలిపారు.
Discussion about this post