YS Sharmila Joins Congress Party : వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారైంది. కొన్ని రోజులుగా షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియామకం అవుతుందని ఒక న్యూస్ హల్చల్ చేసింది. ఇప్పుడు ఆ వార్తను నిజం చేస్తూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లనుంది. ఈనెల నాలుగో తేదీన షర్మిల మొదటిగా ఢిల్లీకి వెళ్తారు. ఇప్పటికే ఈ విషయం పైన కాంగ్రెస్ కూడా కొన్ని ముందస్తు లీకులను విడుదల చేసింది.
షర్మిల కాంగ్రెస్ తో చేర్చుకొని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా కొన్ని సంకేతాలు, కొన్ని రోజులుగా అందుతున్నాయి. ఆ సంకేతాలకు అనుగుణంగానే షర్మిల సైతం కాంగ్రెస్ కు అనుకూలంగా కొన్ని రోజుల నుంచి స్టేట్మెంట్ లు కూడా ఇచ్చారు.
అలాగే తన కుమారుడి పెళ్లి పత్రికను వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ఉంచి, ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈ కార్యక్రమంలో మీడియాతో ముఖంగా షర్మిల తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే షర్మిల తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
షర్మిల, జగన్ కి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో, ఎన్నికల ప్రచార నిర్వహించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలా అయితే టిడిపి, జనసేన పార్టీలు షర్మిల కాంగ్రెస్ లో చేయడానికి మరింత ఆసక్తికరంగా చూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పులివెందులలో భారీగా కార్యక్రమాలు ఏర్పాటు కూడా చేస్తున్నారు.
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి సైతం షర్మిల తో పాటు ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. జగన్కు వ్యతిరేకంగా షర్మిల వచ్చే ఎన్నికల్లో ప్రచారం మొదలు పెడితే ఎలా అని వైసిపి లో ఒక టెన్షన్ వాతావరణం మొదలైందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తుంటే తల్లి విజయమ్మ ఎటువైపు ఉంటారు. షర్మిలవైపా, జగన్ వైపా అని ఇప్పుడు ఒక చర్చ కూడా జరుగుతుంది. చూద్దాం రాబోయే రోజులలో ఏపీ రాజకీయాలు ఇంకెలా మారుతాయో..