దారుణంగా పల్లవి ప్రశాంత్ పరువు తీసిన రతికా రోజ్.. ఒక వేళ నేను లవ్ చేస్తున్నానని చెబితే
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రతికా రోజ్ బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. రతిక హౌస్ లో ఉన్నప్పుడు ఆమె ప్రేమ వ్యవహారాలు బయట బాగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ రూమర్స్ రతికకి నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఏదైనా పబ్లిసిటీనే కదా.. దీనితో రతిక గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకోవడం ప్రారంభించారు.
ఇంతలోనే హౌస్ లో మరో లవ్ ట్రాక్ నడిపింది రతిక. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని ప్రేమ పేరుతో తన వెంట తిప్పుకుంది. చిన్న రొమాంటిక్ వేషాలు కూడా వేసింది. కానీ మొండిగా బిహేవ్ చేయడం, పల్లవి ప్రశాంత్ ని అవమానించడంతో ఆమెపై నెగిటివిటి ఎక్కువైంది. త్వరగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ వైల్డ్ కార్డు ద్వారా మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి పల్లవి ప్రశాంత్ అక్కా అక్కా అంటూ రివర్స్ అటాక్ చేశాడు.
హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా రతిక.. పల్లవి ప్రశాంత్ పై సెటైర్లు వేయడం మానడం లేదు. రీసెంట్ గా రతిక సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ చాట్ లో ఓ అభిమాని పల్లవి ప్రశాంత్ గురించి అడిగాడు.
రతికని ఆ నెటిజన్ అడుగుతూ.. పల్లవి ప్రశాంత్ ని లవ్ చేస్తున్నట్లు ప్రాంక్ చేయాలని అడిగాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని అన్నాడు. దీనికి రతిక బదులిస్తూ.. ఒక వేళ నేను లవ్ చేస్తున్నట్లు ప్రాంక్ చేస్తే దానిని అర్థం చేసుకునేంత బుర్ర ప్రశాంత్ కి లేదు. ప్రశాంత్ చాలా సెన్సిటివ్.. ఆ పైన ఏమైనా జరగొచ్చు అని సమాధానం ఇచ్చింది.
ఏది ఏమైనా నేను ప్రేమ విషయాల్లో ప్రాంక్ చేయనని రతిక తేల్చి చెప్పింది. రతిక సినిమాల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. బాలయ్య భగవంత్ కేసరి చిత్రంలో రతిక ఫన్నీ రోల్ లో మెరిసింది.