Gopichand : వాళ్ళని నమ్మి నష్టాల పాలైన గోపీచంద్.. ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా ఎందుకు దాచాడంటే
హీరో గోపీచంద్ అంటే అందరు స్టార్ హీరోల అభిమానులు ఇష్టపడతారు. నెగిటివిటి లేని వ్యక్తి గోపీచంద్. వివాదాలకు తావు లేకుండా సైలెంట్ గా తనపని తాను చేసుకుని వెళతాడు. అయితే ఇటీవల గోపీచంద్ కి సరైన సక్సెస్ లేదు. ఒక్క హిట్ కోసం గోపీచంద్ కష్టపడుతున్నారు. గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం భీమా. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన కంటెంట్ ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. దీనితో గోపీచంద్ కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. అలీతో సరదాగా సీజన్ 2 కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొన్నారు. అలీ అడిగే సరదాగా ప్రశ్నలకు గోపీచంద్ సమాధానం ఇచ్చాడు.
మీకు మొహమాటం ఎక్కువట కదా.. కెరీర్ లో దానివల్లే చాలా నష్టపోయాను అని విన్నాను నిజమేనా అని అలీ అడగగా.. నిజమే చాలా నష్టపోయాను. అందుకే ఇకపై మొహమాటాలకు తావు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను అని సమాధానం ఇచ్చారు. అయితే గోపీచంద్ నష్టపోయింది కెరీర్ లోనా లేక బిజినెస్ లోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇండస్ట్రీలో గోపీచంద్ గురించి ఎవరికీ తెలియని మరో కోణాన్ని కూడా అలీ ఆవిష్కరించాడు. చాలా మంది చిన్న పిల్లలని చదివిస్తున్నారు అట కదా.. ఎందుకు ఈ విషయాన్ని ఎప్పుడూ బయటకి చెప్పుకోలేదు అని అలీ అడగగా.. గోపీచంద్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. మనం బయటకి చెప్పుకోవడం లాంటిది ఏమి అక్కర్లేదు. వాళ్ళు బాగా చదువుకుంటే చాలు. ఆ పిల్లల్లో చాలా మందికి నా పేరు కూడా తెలియదు అని గోపీచంద్ తెలిపారు. వాళ్ళు బాగా చదువుకోవడమే తనకు కావాల్సింది అని గోపీచంద్ పెద్ద మనసు చాటుకున్నారు.