Manchu Manoj : కుటుంబానికే సాయం చేయని వాడు రాష్ట్రానికేం చేస్తాడు.. ఆలోచించి ఓటు వేయండి, మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
మంచు ఫామిలీలో మంచు మనోజ్ ది వైవిధ్యమైన శైలి. ఎప్పుడూ జోవియల్ గా ఉండే మనోజ్ కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్ గా కూడా ఉంటారు. కొంతకాలంగా మనోజ్ తన రెండవ పెళ్లితో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. భూమా మౌనికని మనోజ్ గత ఏడాది రెండవ వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి.
ఇక సినిమాల విషయానికి వస్తే మనోజ్ వెండితెరపై మెరిసి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం మనోజ్ కొన్ని చిత్రాలని లైన్ లో పెడుతున్నాడు. అదే విధంగా బుల్లితెరపై మనోజ్ హోస్ట్ గా మారాడు. ఉస్తాద్ అనే షోకి మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మంచు ఫ్యామిలీ మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ అంతా శ్రీ విద్యానికేతన్ 32వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో మంచు మనోజ్ సంచలనమైన పొలిటికల్ కామెంట్స్ చేశారు. త్వరలో ఎలక్షన్ రాబోతున్నాయి. మీరంతా ఆలోచించి ఓటు వేయండి. అందరినీ కలుపుకునిపోయే నాయకుడిని ఎంచుకోండి. విడదీసే నాయకుడిని కాదు.
సొంత కుటుంబానికే సాయం చేయలేని నాయకులు రాష్ట్రానికి ఏం సాయం చేస్తారు. డబ్బులిచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆలోచించి సరైన నాయకుడికి వేయండి మంచు మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీకి గుచ్చుకునేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో మనోజ్ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. మనోజ్ వ్యాఖ్యలతో వైయస్ జగన్ కుటుంబంలోని విషయాలని నెటిజన్లు పోల్చుతున్నారు.