అంతా అబద్దం.. గుంటూరు కారంతో ముడిపెడుతూ తనపై ఫేక్ న్యూస్, రష్మీ ఫైర్
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో యాంకర్ గా రాణిస్తోంది. అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో మెరుస్తోంది. గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మీ.. సిద్దు జొన్నలగడ్డతో కలసి ఎంతో బోల్డ్ గా నటించిందో చూశాం.
ఆ చిత్రం హిట్ కావడంతో రష్మీకి బోల్డ్ రోల్స్ ఇంకా చాలా వస్తాయి అని భావించారు. కానీ రష్మీ సినిమాల్లో అంతగా యాక్టివ్ కాలేదు. అప్పుడప్పుడూ మెరుస్తోంది అంతే. అయితే సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో రష్మీకి అవకాశం వచ్చిందనే రూమర్స్ వచ్చాయి.
కుర్చీ మడతపెట్టి అనే మాస్ సాంగ్ సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఆ పాటలో నటి పూర్ణ స్పెషల్ డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ఒకవైపు మహేష్, శ్రీలీల చెలరేగిపోతుంటే.. తన డ్యాన్స్ హావభావాలతో పూర్ణ కూడా ఆకట్టుకుంది.
అయితే ముందుగా ఈ అవకాశం రష్మీకి వచ్చిందనే రూమర్స్ ఉన్నాయి. కానీ రష్మీ రిజెక్ట్ చేయడంతో పూర్ణని సంప్రదించారట. అనవసరంగా రష్మీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అని సోషల్ మీడియాలో నెటిజెన్ల కామెంట్స్ ఎక్కువయ్యాయి. దీనితో రష్మీ గౌతమ్ స్పందించక తప్పలేదు. రష్మీ సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తూ.. అదంతా ఫేక్ న్యూస్… గుంటూరు కారం చిత్రం కోసం నన్ను ఎవరూ అప్రోచ్ కాలేదు. అలాంటప్పుడు నేను ఎలా రిజెక్ట్ చేస్తాను ? ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నాపై నెగిటివిటీ పెరుగుతోంది. దయచేసి ఆపేయండి అని రష్మీ కోరింది. పూర్ణ గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశారని ప్రశంసించింది.