కరోనా మహమ్మారి అన్ని రంగాలలో ప్రముఖులను పట్టిపీడిస్తోంది.
ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడడం సాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్గా నిర్థరణ అయింది.
తనకు కరోనా సోకిందని అయన సామాజిక మాధ్యమాల్లో తెలియజేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని,ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మూడు రోజులుగా అస్వస్థతగా ఉండటంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నట్లు, పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, మందులు ఇచ్చి హోంక్వారంటైన్లో ఉండమని వైద్యులు సూచించినట్లు చెప్పారు. అయితే కుటుంబసభ్యులను ఇబ్బందుల్లో పడేయటం ఇష్టంలేక ఆస్పత్రిలో చేరినట్లు ఎస్పీ బాలు వెల్లడించారు.
ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.
తనను పరామర్శించేందుకు చాలా మంది ఫోన్ చేస్తున్నారని కానీ వారితో మాట్లాడే పరిస్థితిలో లేనని,విశ్రాంతి తీసుకోవడానికే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. కేవలం జలుబు, జ్వరంతో బాధపడుతున్నానని,ప్రస్తుతం జ్వరం కూడా తగ్గిందని మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తానని తెలిపారు.
Discussion about this post