నయనతార అంటే తెలుగు నిర్మాతలకు భయం.. అందుకు కారణం ఆమె తీసుకునే పారితోషికమే. టాలీవుడ్ లో తొలిసారి కోటి రూపాయలు పారితోషికం తీసుకొన్న నటి నయనతారనే. తెలుగు సినిమా అనేసరికి కోట్లకు కోట్లు పారితోషికం డిమాండ్ చేయడం నయనతార అలవాటుగా మారింది.
తాజాగా నితిన్ సినిమా అంధూధాన్ రీమేక్ కోసం నయనని సంప్రదించారు. అయితే మరోసారి నిర్మాతలకు పారితోషికం పేరుతో చుక్కలు చూపించింది నయన. ఈ సినిమా కోసం ఏకంగా 9 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. నయన పారితోషికం ఇప్పటి వరకూ 5 కోట్లలోపే. ఆ మాత్రం ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. కానీ నయన 9 కోట్లు అడిగే సరికి బిత్తరపోయారు. నితిన్ పారితోషికం 6 కోట్ల లోపే. నితిన్ కంటే నయనకి ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిరావడం నితిన్ని ఇబ్బంది పెట్టే విషయమే. దాంతో ఈ సినిమాలో నయనని ఎంచుకోవాలన్న నిర్ణయాన్ని చిత్రబృందం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.