తన నటనతోనే కాదు తన రాజీలేని వ్యక్తిత్వం, సూటిగా మాట్లాడే బోల్డ్ నెస్ తో వార్తల్లో నిలిచే నటి రాధిక ఆప్టే మరొకసారి బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన ‘రాత్ అకేలీ హై’ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో నటించడానికి తను ముంబయికి వెళ్లాలి అనుకున్నప్పుడు చాలా మంది బాలీవుడ్ గురించి చెడుగానే చెప్పారని అన్నారు.
పూణే నుంచి సినిమాల కోసం ముంబయి వెళ్లాలని భావించా. అప్పుడు చాలా మంది నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్తే నీపై అత్యాచారం చేస్తారు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోందని చెప్పారు. సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై ప్రజలకు సదాభిప్రాయం లేదు. అసలు సమస్య ఎక్కడుందంటే.. మనం కేవలం బాలీవుడ్లో జరిగే అతి గురించే మాట్లాడుకుంటాం. కానీ మనమంతా మనుషులమేనని అర్థం చేసుకోవాలి. నేను అందరిలాంటి మనిషినే. అందరివి సాధారణ జీవితాలుగానే చూడాలి అని రాధికా చెప్పుకొచ్చింది.
Venu Swamy : సలార్ మూవీ ఫ్లాప్, మళ్ళీ వివాదం రేపిన వేణు స్వామి.. అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల నష్టాలే
Venu Swamy : సలార్ మూవీ ఫ్లాప్, మళ్ళీ వివాదం రేపిన వేణు స్వామి.. అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల నష్టాలే యంగ్ రెబల్ స్టార్...