వీరమల్లుని ఆపేసి దేవసేనని దింపారు..ఒరిస్సాలో మొదలు పెట్టిన అనుష్క, పవర్ ఫుల్ స్టోరీ ఇదే
ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇతర చిత్రాలకు కమిటై ఉండడం.. జనసేనానిగా పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ఈ చిత్ర షూటింగ్ ముందుకు సాగలేదు. ఏపీలో ఎలక్షన్ హీట్ సాగుతోంది. దీనితో పవన్ కళ్యాణ్ ఇప్పట్లో హరిహర వీరమల్లు చిత్రానికి డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు.
దీనితో హరిహర వీరమల్లు చిత్రం తాత్కాలికంగా ఆగిపోయినట్లు అయింది. క్రిష్ చాలా కాలంగా హరి హర వీరమల్లు పైనే ఉన్నారు. ఇంకా ఆలస్యం అయ్యేలా ఉండడంతో సైలెంట్ గా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టారు. అది కూడా క్రేజీ కాంబినేషన్. స్వీటీ అనుష్కతో క్రిష్ బలమైన లేడి ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఒరిస్సాలో మొదలయింది. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అనుష్క దాదాపు 6 నెలల తర్వాత మరోసారి కెమెరా ముందుకు వచ్చింది. ఈ చిత్ర కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరుగుతుంది అట. ప్రస్తుతం క్రిష్ అనుష్కపై ఒరిస్సాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
తనకు జరిగిన అన్యాయాన్ని ఒక మహిళగా అనుష్క ఎలా ఎదుర్కొంది.. చివరకి ఎలా విజయం సాధించింది ? ఆమెకి ఎదురైన పరిస్థితులు ఏంటి ? అనే అంశాలతో ఈ చిత్ర కథ ఉండబోతోందట. ఆల్రెడీ అనుష్క.. క్రిష్ దర్శకత్వంలో దాదాపు 14 ఏళ్ల క్రితం వేదం చిత్రంలో నటించింది. వేదం చిత్రంలో అనుష్క నటనకి ప్రశంసలు దక్కాయి. సో అనుష్క, క్రిష్ కి మధ్య బాగా సింక్ కుదురుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.