భారీ అంచనాలు ఉన్న కన్నడ చిత్రం కేజియఫ్2 షూటింగ్ ఆగస్టు 15 నుంచి పునప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. కన్నడ స్టార్ యాష్ నటించిన కేజియఫ్ బాక్సఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి అందరికి తెలిసిందే. గత మే నెలలోనే కర్ణాటక గవర్నమెంట్ సినిమా షూటింగ్ లకి అనుమతులు ఇచ్చింది. అయినా కరోనా వ్యాప్తి కారణంగా నిర్మాతలు షూటింగ్ మొదలు పెట్టలేదు.
కానీ ఇప్పుడు నిర్మాతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కరోనా కారణంగా ప్రభుత్వ నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి షూటింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ సెట్ లో ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది, ఇంకా 10 నుంచి 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా పూర్తి చేసి అన్ని అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేస్తామని చిత్ర వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.