Mahesh Babu Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. అయితే ఈ గుంటూరు కారం మూవీని మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ తో సోషల్ మీడియా షేక్ అవ్వగా నిన్న విడుదలైన గుంటూరు కారం ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కి అందరి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పాడు నిర్మాత నాగవంశీ. అలాగే ఈ మూవీ నుంచి నెక్స్ట్ బిగ్ అప్డేట్ మహేష్ బాబు బర్త్ డే రోజు ఆగస్టు 9న ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.
Super Fans, Your response in the Theatres is nothing short of a festival! 🤩
Our special thanks to one and all who came to theatres & unveiled our #GunturKaaram #MassStrike. Wait for the next big update on 9th August! ❤️
Keep the expectations high till then! 🔥…
— Naga Vamsi (@vamsi84) May 31, 2023