AP High Court Suspended GO No 1: రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవో తెచ్చిన ఏపీ ప్రభుత్వం
జీవోను హైకోర్టులో సవాల్ చేసిన సీపీఐ రామకృష్ణ ఈ నెల 23 వరకు జీవోను సస్సెండ్ చేసిన హైకోర్టు..
రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ వన్ ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను నేడు విచారించిన హైకోర్టు జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read : Veera Simha Reddy Review : బాలయ్య మరో హిట్టు కొట్టాడా లేదా..!?
రామకృష్ణ తరపున అశ్వినీ కుమార్ వాదనలను వినిపించారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని తీసుకొచ్చారని, అప్పుడు కూడా లేని నిబంధనలను ఇప్పుడు విధించారని చెప్పారు. ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 23 వ తేదీ వరకు జీవోపై సస్పెన్షన్ విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.
Discussion about this post