AP Politics : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలు స్తబ్దుగా మారిపోయాయి. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టినా రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టడం మానేసి పూర్తిగా మౌనం వహిస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి కేసు, ఇతరత్రా స్ధానిక అంశాలపైనే ఎక్కువగా చర్చ కనిపిస్తోంది. గతంలో చాల దూకుడుగా వ్యవహరించిన సీఎం వైఎస్ జగన్ ఇప్పుడూ ఆచీతూచీ స్పందిస్తూ పరిపాలనపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆరునెలల క్రితం గమనిస్తే మూడు రాజధానుల వ్యవహారం లేదా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల అజెండాగా ఉంటాయని అంతా భావించేవారు.
కానీ రెండు నెలలుగా పరిస్ధితుల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఆత్మావలోకనం లోకి వెళ్లిపోయాయి. ముందు తగ్గుదాం తర్వాత నెగ్గుదాం
టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కూడా సమయం కోసం ఎదురుచూస్తున్నారు. పొత్తులు అనేది ప్రజలకు ఉపయోగపడితే పరిశీలిస్తామని తాము ప్రస్తుతానికి బీజేపీ తో పొత్తులో ఉన్నామని రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, అభివృద్ధి కోసం పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు. ఈ విషయంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు.
చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకువస్తే ఆలోచిస్తాం ప్రజాశ్రేయస్సు కోసం శ్రమిస్తున్న జనసైనికుల దృష్టి మరల్చడానికి, జనసేన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని, వాటిని సరిగా అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాల్సి ఉందని జనసేనాని దిశానిర్దేశం చేశారు పొత్తుల గురించి ఎవరికి వారు ఏదేదో మాట్లాడొద్దు, పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం పై త్వరలో ప్రకతన చేస్తాం అని పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ లో స్పష్టం చేయడం గమనిస్తే.. జనసేనపొత్తుల విషయంలో ఒక ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ స్తునంట్లు న్నారు.
కార్యకర్తలను కూడా మానసికంగా పొత్తుల కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన-బీజేపీ కూడా తమ పొత్తు ఎన్నాళ్లు ఉంటుందో తెలియని పరిస్దితుల్లో విడివిడిగానే కార్యాచరణ చేపట్టాయి ప్రధాని మోడీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు గమనిస్తే జనసేన ఇంకా బీజేపీ ఆధినాయకత్వానికి దూరం కాలేదన విషయం అవగతం కానీ క్షేత్రస్దాయిలో బీజేపీ నాయకుల ప్రవర్తన ప్రకటనల తీరు వైవిధ్యంగావుండటం పొత్తు కొనసాగదన్న అనుమానాలు బలపడుతున్నాయి.
కమలంతో దోస్తికి తహతహ :
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అంటారు. చంద్రబాబు ఈ సూత్రాన్ని నూటికి నూరు శాతం అనుసరిస్తారు. ఆయనకు నచ్చక పోతే దూరం జరుగుతారు. నచ్చితే మళ్లీ దగ్గర చేరేందుకు ఆరాటపడతారు. టీడీపీని తన చేతుల్లోకి తీసుకున్నాక చంద్రబాబు మార్క్ రాజకీయ విన్యాసం. దేశాభివృద్ధి కోసం తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని విజన్తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యలు బీజేపీతో బాహాటంగా జట్టుకు తహతహ లాడుతున్నారని సంకేతాలు పంపినట్లుగానే భావించవచ్చు. టీడీపీ కూడా తెలంగాణ ఎన్నికలు దగ్గరపడ్డాక బీజేపీతో పొత్తు ఎలాగో కుదురుతుందన్న ధీమాలో కనిపిస్తోంది.
ప్రధాన విపక్షం టీడీపీ కూడా వ్యూహాత్మక నిర్ణయాలు టికెట్ల ఖరారు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, పొత్తుల విషయంలాంటి ఆంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనకాడుతోంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్నా అది జనానికి రీచ్ అయ్యేలా ఎలాంటి ప్రత్యేక వ్యూహాలు అనుసరించడం లేదు. చంద్రబాబు జిల్లాపర్యటనలు చేస్తున్నా అప్పటికప్పుడు విమర్శలకే పరిమితం అవుతున్నారు.
ఈ వ్యవహారంలో తెలుగుదేశం నుంచి బీజేపీ లోకి మారిన నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటన్నింటికీ మించి వైఎస్ వివేకా కేసుతో పాటు కోడి కత్తి కేసుల్లోనూ వచ్చే తీర్పుల తర్వాత, కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం మారే రాజకీయ పరిస్దితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలన్న భావనలో అన్ని పార్టీలు కనిపిస్తున్నాయి.
Discussion about this post