• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Political News

AP Politics : ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న పొలిటికల్ హీట్ – వేగంగా మారుతున్న సమీకరణాలు..!

టీడీపీ జనసేన ఎక్కడ వెనకబడ్డాయి అంటే..?

TrendAndhra by TrendAndhra
February 5, 2024
in Political News
247 5
0
AP Politics : ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న పొలిటికల్ హీట్ – వేగంగా మారుతున్న సమీకరణాలు..!
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

AP Politics : ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న పొలిటికల్ హీట్ – వేగంగా మారుతున్న సమీకరణాలు..!

2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో 151 సీట్లతో భారీ మెజారిటీ సాధించిన అధికార వైసీపీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే ఊపు కొనసాగించే దిశగా పావులు కదుపుతోంది. మరో పక్క ఈసారి ఎలాగైనా జగన్ రెడ్డిని గద్దె దించటమే ఉమ్మడి ఆశయంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీలు కూడా జనాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ సోదరి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం ఏపీ పొలిటికల్ పిక్చర్ లో దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

AP Politics

అధికార వైసీపీ తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు రాజధాని అంశంలో జగన్ ప్రభుత్వ అసమర్థత, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం, ప్రత్యేక హోదా అంశంలో ప్రభుత్వ వైఫల్యం,మద్య పాన నిషేధం విషయంలో జగన్ సర్కార్ చేసిన మోసం, అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు సమర్థవంతంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

 

Ap politics

అసలే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ఆపై ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగడం, జగన్ సొంత చెల్లి షర్మిల తీవ్ర విమర్శలు చేస్తుండటం ప్రతిపక్షాల నెత్తిన పాలు పోసిన చందంగా మారింది. మొన్నటి దాకా ” వై నాట్ 175 ” అంటూ కాలర్ ఎగరేసిన జగన్ అండ్ కో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, అధికార పార్టీ పట్ల వీస్తున్న వ్యతిరేక పవనాల ప్రభావంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం తిలోదకాలు ఇస్తూ వ్యూహ రచన చేస్తూ సర్వ శక్తులు ఒడ్డి ప్రయత్నిస్తోంది.

సీట్ల కేటాయింపులో పవన్ కళ్యాణ్ మర్మం ఇదే..!!

మొత్తం మీద జగన్ సర్కార్ మేకపోతు గాంభీర్యంతో వ్యవహరిస్తున్నప్పటికీ టీడీపీ, జనసేన కూటమి కేవలం జగన్ మీద ఉన్న వ్యతిరేకత మీద మాత్రమే ఆధారపడి రెండు పార్టీల కలయికతో పెరిగిన బలమే తమను గెలిపిస్తుంది అనుకుంటే పొరపాటు పడినట్టే అవుతుంది. వైసీపీ మీద వ్యతిరేకత తప్ప కూటమికి జనం వోట్ వేయించే సరైన అంశం ఏదీ ఆ రెండు పార్టీలు  ప్రజల లోకి తీసుకుని వెళ్లక పోవడం అతి పెద్ద మైనస్. ఇకనైనా అప్రమత్తంగా పావులు కదిపి ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోకపోతే మాత్రం అధికారం చేజిక్కించ్చుకోవటం అంత సులభమేమి కాదనే చెప్పాలి. ఆ రకంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని మించే రేంజ్ లో హై ఇస్తున్న ఏపీ పొలిటికల్ పిక్చర్ కి ఎలాంటి ఎండ్ కార్డు పడుతుందో వేచి చూడాలి.

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AP PoliticsJanasenaTdpYsrcp
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.