BJP Situation in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితి అగమ్యగోచరమనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి బిజెపి అన్యాయం చేసిందని నమ్ముతారు. బిజెపి ఆంధ్ర ప్రదేశ్ కి మర్చిపోలేని ద్రోహం చేసిందని అక్కడివాళ్ళు విశ్వసిస్తారు. అందుకే బిజెపి స్థానం ఆంధ్రాలో ఎప్పుడు అధమం అనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బిజెపికి అతి తక్కువ ఓట్లు లభించాయి. ఒకరకంగా కాంగ్రెస్ కంటే కూడా చాలా తక్కువ ఓట్లు బిజెపికి వచ్చాయి.
అంటే ఏపీ ప్రజలలో బిజెపి స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో బిజెపి పొత్తుతో ముందుకు వెళ్లాలి వైయస్ జగన్ ని ఓడించాలి అని వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. అయితే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా ఉంది. అదే విధంగా ప్రత్యర్థులపై ఈడి, సిబిఐ, ఐటి దాడులతో భయపెట్టడంలో బిజెపిది ఎప్పుడు ముందంజ. ఈ కారణాలతోటే బిజెపికి అడుగులకు మడుగులోత్తే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
చాలామందిలో వ్యతిరేకిస్తే తమ భాగోతాలు ఎక్కడ బయటపెట్టేసి ఐటీ దాడులు చేపిస్తుందేమో అని భయంతో నోరు మూసుకొని ఉంటారు. అలా బీజేపీ తన అధికారాన్ని చెలాయిస్తుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఎలాగైనా గద్దె దించాలని తాపత్రయంతో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను అమిత్ షా చాలా తెలివిగా చర్చల కోసం ఢిల్లీకి పిలిచారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. నేడు పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే సన్నాహాల్లో ఉన్నారు. ఒంటరిగా రంగంలోకి దిగితే బిజెపికి 0% ఓట్లు లభిస్థాయి అనేది బాగా తెలుసు. అందుకే చాలా తెలివిగా అమిత్ షా పకడ్బందీ వ్యహాన్ని పన్నారు.
టిడిపి, జనసేన, బిజెపితో పెట్టుకునే పోత్తులో భాగంగా, 15 అసెంబ్లీ స్థానాలను, 5 లోక్ సభ స్థానాలను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడే అమిత్ షా చాలా వ్యూహాత్మకంగా తన పావులు కదుపుతున్నాడు. పొత్తు కోసం తామేమి టీడీపీ దగ్గరికి వెళ్లలేదని, టిడిపినే తమ దగ్గరికి పొత్తు కావాలని వచ్చారని, కాబట్టి మేము చెప్పిన షరతులకు వాళ్ళు తప్పకుండా అంగీకరించాల్సిందే అని అమిత్ షా అన్నారని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. అసలు ఆంధ్రాలో ఉనికి కూడా లేనటువంటి బిజెపి పార్టీకే అన్ని సీట్లు కేటాయిస్తే, ఇప్పటికే ప్రజల మన్ననలు పొంది జనసేనకు ఒక గుర్తింపు తెచ్చుకొని, ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల బాగోగులను పట్టించుకుంటూ, ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్నటువంటి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది ఇప్పుడు వాడి వేడిగా జరుగుతున్న చర్చ.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక వాదన నడుస్తుంది. జనసేనకు 25 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లు ఇస్తారని వార్త ప్రచారంలో ఉంది. ఇప్పుడు కొత్తగా బిజెపితో పొత్తు పెట్టుకుని వారికి 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తే తమకు కనిష్టంగా 50 సీట్లు కేటాయించాల్సిందేనని ఆ పార్టీ వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలలో ఏమాత్రం నమ్మకం లేని బిజెపి, గుర్తింపు లేని బీజేపీ, ఈ రోజు అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి గెలుస్తామని ధీమాతో పొత్తు అని ఒక ఎత్తుతో ముందుకు వస్తుంది. దీనిని గ్రహించకుండా పొత్తుకు అంగీకరించి చంద్రబాబు ఇరకాటంలో పడే వ్యవహారమే కనిపిస్తుంది. బిజెపిని పక్కకు పెట్టి జనసేన, టిడిపి రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా విజయం వరిస్తుంది.
కానీ పరిస్థితి చూస్తుంటే దానికి తారుమారుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనాప్పటికీ ప్రజల మనసుల్లో ఎవరైతే ఉంటారో వారే చివరికి సింహాసనాన్ని అధిష్టిస్తారు. ఈ రాబోయే ఎన్నికలు ఎవరికి ఆ విజయాన్ని చేకూరుస్తాయో చూడాల్సిందే..