Chandrababu Met Amit Shah : ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలవేళ సీట్ల కేటాయింపులు, పొత్తులు లాంటి అంశాలతో రాజకీయ పార్టీలన్నీ చాలా హడావిడిగా గడుపుతున్నాయి. ముఖ్యంగా సీట్ల కేటాయింపులపైనే రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించి ముందుకు వెళుతున్నాయి.
అధికార పార్టీ వైసిపి ఒంటరిగా ఎన్నికలలో నిలబడుతుండగా, టిడిపి, జనసేన మాత్రం కూటమిగా కదులుతున్నాయి. అలాగే జనసేన, బిజెపి ఇప్పటికే పొత్తు కూడా కొనసాగిస్తున్నాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన, బిజెపి ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఎన్నికల బరిలో నిలిస్తే తిరుగు ఉండదు అని చెప్పి ఒక వార్త ప్రచారం అవుతుంది.
అందరూ తమ నమ్మకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు పైన పెట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర బీజేపీ పెద్దలు దానికి అనుకూలంగా స్పందించకపోవడంతో చంద్రబాబు సైలెంట్ గానే ఉన్నారు.
టిడిపి తో పొత్తు పెట్టుకునే దిశగా బిజెపి సంకేతాలు తాజాగా చంద్రబాబుకు అందాయి, ఇక ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఢిల్లీకి వెళ్లారు. నిన్న రాత్రి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ చర్చను చేశారు. అయితే టిడిపి, బిజెపి జనసేన పొత్తు అలాగే సీట్ల పంపకాల వంటి చాలా విషయాల పైన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. అయితే అప్పుడు జనసేన ఈ రెండు పార్టీలకు మద్దతుని ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బిజెపి, టీడీపీ కూటమి గెలిచే అధికారంలోకి రావడంతో, ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకుంటే తప్పకుండా అధికారంలోకి వస్తుందని అమిత్ షా భావించినట్లు తెలుస్తుంది. అందుకే వెంటనే చంద్రబాబుకు కబురు పంపగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.
ఇక ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్లబోతున్నట్లుగా ఒక సమాచారం తెలుస్తుంది. పవన్ తో చర్చించిన అనంతరం ఢిల్లీ నుంచి చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పొత్తులో భాగంగా బిజెపి కోరినన్ని సీట్లు ఇచ్చైనా సరే పొత్తు ఖరారు చేసుకుని ఏపీలో అధికారంలోకి రావాలని ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది.
మరోరకంగా చూసుకుంటే వైసీపీ మాత్రం చాలా ధీమాగా ఎన్నికల వారిలో నిలవబోతుంది. చంద్రబాబు ఎత్తుగడులు ఎప్పుడు ఏరకంగా మారుతాయో అర్థం చేసుకో లేకుండా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు బిజెపితో పొత్తు కాయమైతే మాత్రం వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. మూడు పార్టీలను ఏకకాలంలో ఎదుర్కోవాలంటే అది వైసీపీకి తలకు మించిన బారం లాగే ఉంటుంది.
ఇప్పటికే వైసిపి చాలా నెగటివ్ మద్దతు కూడగట్టుకుంది. చంద్రబాబు రాజకీయంగా పావులు కదపడం మొదలుపెట్టి అటు బిజెపిని ఇటు జనసేన ను కలుపుకొని ఎన్నికల బారిలోకి దిగడం అనే ఆలోచన విజయానికి తొలిమెట్టు లాగా కనిపిస్తుంది. చాలామంది నుంచి ఇక వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపిల పొత్తుకు ఎదురు ఉండదని పాజిటివ్ వాదన ప్రచారం అవుతుంది.