Chandrababu Naidu – YS Jagan : చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం చాలా విస్తారమైనది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగి ప్రజల మధ్యనే ఉన్నారు. కానీ వైయస్సార్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణాన్ని సానుభూతి పేరుతో అడ్డం పెట్టుకొని గెలిచారు. గెలిచిన తర్వాత ఏపీలో పెద్దగా మార్పులు ఏమి తీసుకురాలేదు. సర్వసాధారణమైన పరిపాలన కూడా అందించలేకపోయారు.
అయితే చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్ ని బాగానే టార్గెట్ చేశాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. చంద్రబాబు ఇంత పట్టుదలతో జగన్ ని గద్దే దింపాలని చూస్తున్నాడంటే దాని వెనక తన బాధ ఎంతుందో చూడాలని మీడియా ముఖంగా తెలియజేశారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం జగన్ కి పరిపాటి అయిపోయింది. నా భార్యను రాజకీయాల్లోకి లాగి ఆమె గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి.
ఆరోజు నేను బాధపడినంతగా ఏరోజు కూడా బాధపడలేదు. నా సతీమణిని ఎప్పుడూ కూడా బయటకి రాదు. అలాంటి ఆమె గురించి చాలా నీచంగా జగన్ పెయిడ్ బ్యాచ్ మొత్తం మాట్లాడారు. నేను అది ఎప్పటికీ మర్చిపోలేను. కచ్చితంగా దానికి ప్రతీకారం తీర్చుకుంటాను అన్నారు చంద్రబాబు. అదేవిధంగా ఆయనను జైలుకు పంపించడం విషయం పట్ల కూడా స్పందించారు.
అక్రమ కేసులు ఆరోపించి జైలకే పరిమితం చేయాలని చూశారు. కానీ న్యాయం మా వైపు ఉండడం వల్ల నేను బెయిల్ పైన బయటికి రాగలిగాను అన్నారు. చంద్రబాబు ఈ రెండు విషయాల పట్ల బాగా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. అలాగే వైయస్ జగన్ తన బాబాయ్ ని వదల్లేదు. తన తల్లిని, చెల్లిని కూడా వదలకుండా ఇబ్బంది పెడుతున్నారని కాస్త ఘాటు విమర్శలు చేశాడు చంద్రబాబు.
వైయస్ జగన్ అలా ఉండడం వలన షర్మిల వెళ్లి కాంగ్రెస్ లో జాయిన్ అయిందని, అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే దాని వెనకాల అన్న కుట్ర ఎంతుందో ఆలోచించాలని చంద్రబాబు మీడియా ముఖంగా తెలిపారు. చంద్రబాబు మనసులో ఇలాంటి ప్రగాఢ ముద్రలు పడడంతో ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో జగన్ ని గద్దె దింపాలని కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ దిశగానే ఆయన ఈ వయసులోనూ వదలకుండా సభలు ,సమావేశాలు నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలోనే ఉన్నారు.