Chandrababu Naidu’s New Strategy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, పార్టీలు కొత్త కొత్త విధానాలతో ముందుకు వెళుతూ, ప్రజల మన్నానలను పొందే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు సైతం కదలిరా పేరుతో సభలను నిర్వహిస్తున్నారు. ఈ సభలు చంద్రబాబుకు ఏమాత్రం ఆశాజనకంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు రేపు “రా కదలిరా” సభలను చంద్రబాబు వివిధ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఉండవల్లిలోనే తన నివాసం నుంచి హెలికాప్టర్ లో అనకాపల్లి జిల్లా కే. కోటపాడు కు చంద్రబాబు చేరుకుంటారు. ఉదయం 11.30 నిమిషాలకు గుండుపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన “రా కదలిరా” సభ ప్రాంగణముకు చేరుకొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
చంద్రబాబు హెలికాప్టర్ లో ఏలూరు నుంచి చింతలపూడి చంద్రబాబు చేరుకొని అక్కడ గంగాధర నెల్లూరు మండలం రామానాయుడు పల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ఎన్నికలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే గన్నవరం నుండి రోడ్డు మార్గంలో ఉండవల్లి నివాసానికి తిరిగి వెళ్ళనున్నారు.
అయితే ఇలా వరుస సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని పెంచవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ దూకుడుకు బ్రేకులు వేసే విధంగా వరుసగా సభలు,సమావేశాలు నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో దిశ,నిర్దేశం కచ్చితంగా ఉంటుంది.
ఆ రకంగా పార్టీ శ్రేణులు కూడా ముందుకు వెళ్తే విజయం తధ్యమైన భావనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చాలా విలువైనది. అతని వ్యూహాలు కచ్చితంగా పార్టీని నిలబెట్టే దిశగానే ఉంటాయి. ఈసారి జగన్ కు వెన్నుపోటులు ఎక్కువగా ఉండడంతో టిడిపికి కలిసి వస్తుందని చెప్పవచ్చు.