గుంటూరు జిల్లా తాడేపల్లిలో రోజు రోజుకి గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. కొందరు ఈమధ్య యువకులు గంజాయి బ్యాచ్ అలజడి సృష్టించింన విషయం తెలిసిందే.
ఇదేంటని ప్రశించిన హేమంత్ పై కుటుంబ సభ్యుల ముందు విచక్షణ రహితంగా దాడిగి దిగారు గంజాయి బ్యాచ్. ఇంతటి అరాచకాలు చేస్తున్న ఏదైనా ఐతే తప్ప పట్టించుకోని విధంగా పోలీసులు తీరు కనిపిస్తుంది.
తాడేపల్లి పరిధిలో సుందరయ్య నగర్ ఏడవ లైన్ వద్ద మునికోటి హేమంత్ కుమార్ పై దాడికి దిగిన ఇట్ట రాజేష్ గ్యాంగ్ ను స్థానికులు చూసి పోలీసులకు అప్పగించారు. గంజాయి బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడిన హేమంత్ కుమార్ ఆస్పత్రికి తరలించారు. తన కన్న బిడ్డ ముందే పైశాచికంగా దాడికి దిగడంతో భయాందోళనతో హేమంత్ కుమార్ కూతురు జ్వరంతో వణికి పోతున్నారు…
ఈ ఘటన పై చుట్టుపక్కల స్థానికులు గంజాయ్ బ్యాచ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గంజాయి బ్యాచ్ లో ఇట్టా రాజేష్ ను పోలీసులు నగర బహిష్కరణ చేశారు. ఐనా తాను ఇష్టానుసారంగా ఊర్లోనే ఉంటూ దాడులకు పాల్పుతున్న పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
సీఎం ఉండే ప్రాంతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ దాడులు చేస్తుంటే పోలీసులు ఇక రాష్ట్రంలో ఏమి చేస్తారని స్థానికులు వాపోతున్నారు. మా అబ్బాయికి మా కుటుంబానికి గంజాయి బ్యాచ్ నుంచి ప్రాణ హాని కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి దాడులకు అవకాశం ఉండేది కాదని చూసిన స్థానికులు ఆరోపిస్తున్నారు.