మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పడి వరకు ఎంతో మంది మన దేశాన్ని పాలించిన విషయం తెలిసిందే. వారు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఇక దేశంలో పేదరికాన్ని రూపు మాపేందుకు ఎన్నో పథకాలు తీసుకువచ్చారు. అయితే దేశాన్ని పాలించిన ప్రధాన మంత్రుల్లో ఎవరు ది బెస్ట్ అంటే మన చెప్పలేం.
మొదటి స్థానంలో నరేంద్ర మోదీ!
అందుకే దేశంలో పని చేసిన ప్రధానుల పనితీరుపై ఇండియా టుడే సంస్థ ఓ సర్వే నిర్వహించింది.దేశానికి ఎంతో మంది ప్రధానులు సేవలు అందించారు. ఇక ఈ విషయంపై ఇండియా టుడే ప్రజలతో చర్చించింది. ప్రజల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఉత్తమ ప్రధాని ఎవరో వెల్లడించింది. ఇండియా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం.. దేశ ప్రజల్లో 44 శాతం మంది ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేశారు. ఇక రెండో స్థానంలో మాత్రం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నిలిచారు. ఆయనకు 15 శాతం మంది ప్రజలు ఓటు వేశారు.
ఆ తర్వాతి స్థానాల్లో ఎవరంటే?
ఇక మూడో స్థానంలో ఇందిరా గాంధి నిలిచారు. ఆమె గరీబీ హఠావో నినాదంతో దేశవ్యాప్తంగా కూడు-గూడు-గుడ్డ వంటి సంక్షేమ పథకాలు ప్రారంభించి ఎంతో మందికి సేవలు అందించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మకు కేవలం 14 శాతం మంది ప్రజలు మాత్రమే మొగ్గుచూపారు. ఇక నాలుగవ స్థానంలో మాత్రం మౌన ముద్రతో పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న మన్మొహన్ సింగ్ 11 శాతం మంది ప్రజలు జై కోట్టారు.
మోదీకే ప్రజల మొగ్గు ఎందుకంటే?
ఇక దేశంలో ఉత్తమ ప్రధానిగా మాత్రం నరేంద్రమోదీ నిలిచారు. ఆయనకు 44 శాతం మంది ప్రజల మద్దతు లభించింది. ఈ విషయాన్ని తాజాగా ఇండియా టుడే సంస్థ సర్వే ప్రకటించింది. ఇక నరేంద్ర మోదీకి ఆ రేంజులో మద్ధతు లభించడం వెనుక కారణాలు ఆయన దూరదృష్టి, వ్యూహాలు అని తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నం, రామ మందిర నిర్మాణం ఇవన్నీ చేయడం వల్లే ఆయనను ఉత్తమ ప్రధానిగా నిలబెట్టినట్లు తెలుస్తోంది.