Jagan Met Amit Shah : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి పయనమవుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమీత్ షాను కలిసి ఎన్నికల గురించి, పొత్తు గురించి చర్చించారు. అదేవిధంగా నేడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీ నుంచి కూడా కొన్ని సంకేతాలు వెలువడ్డాయి. ముఖ్యంగా జగన్ ఢిల్లీ వెళుతున్నారని ఒక వార్త బయటకు వచ్చింది.
ఈరోజు సాయంత్రం ఢిల్లీకి జగన్ ని అమిత్ షా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవంతరంగా ఉన్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం గురించి చంద్రబాబు ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. కానీ పొత్తు పెట్టుకుంటేనే మూడు పార్టీలు కలిసి జగన్ పార్టీని ఓడించవచ్చు అనే ధీమాతో ఉన్నారు. కానీ అమిత్ షా మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి నుండి కూడా జగన్ బిజెపితో స్నేహపూర్వకంగానే ఉంటున్నాడు.
రాజకీయంగా ఉన్నటువంటి వ్యతిరేకత ఒకవైపు ఉన్నప్పటికీ మరో రూపకంగా బిజెపిని జగన్ అత్యంత సన్నిహితంగానే చూశాడు. ఇప్పుడు ఉన్నట్టుండి జగన్ ఢిల్లీకి పయనం అవడంతో ఆంధ్రాలో ఒక్కసారిగా కలకాలం రేగిందని చెప్పవచ్చు. నిన్ననే చంద్రబాబును పిలుచుకొని చర్చలు జరిపిన అమిత్ షా నేడు జగన్ నీ పిలుచుకొని మాట్లాడడం గురించి చంద్రబాబు కాసింత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది.
మాతో పొత్తు పెట్టుకుంటానని చర్చలు జరిపారు. ఇప్పుడేమో ఏకంగా జగన్ ని పిలిపించుకొని మంతనాలు నడిపిస్తున్నారు. అసలు బీజేపీ ఉద్దేశం ఏమిటి? ఏ రకంగా వ్యవహరిస్తుంది అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. జగన్ ని, అమిత్ షా ఢిల్లీకి పిలిపించడంలో అత్యంత ముఖ్యమైన విషయాలు చర్చించే అవకాశం ఉన్నాయని మరోవైపు ప్రచారాలు జరుగుతున్నాయి.
అసలు అమీషా ఎత్తుగడ ఏమిటి..? అటు చంద్రబాబును ఇటు జగన్ ని పిలిపించడంలో మర్మం ఏమిటి..? అని ఇప్పుడు టిడిపి నాయకుల్లో ఇటు వైసిపి నాయకుల్లో కూడా గందరగోళం నెలకొంది. అమీషా మనసులో ఏముంది.. అసలు బిజెపి అధిష్టానం ఏం ఆలోచిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు మనం వేసి చూడాల్సిందే..