Janasena : ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సభ్యులు జనసేన పార్టీకి తమ వంతు సహాయంగా రూ.కోటి విరాళం అందజేసారు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన జన సైనికులకు,వీర మహిళలకు సమన్వయకర్తలుగా శశిధర్ కొలికొండ, రాజేష్ మల్లాను నియమించిన విషయం విదితమే. వారి ఆధ్వర్యంలో
“నా సేన కోసం.. నా వంతు..” కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా ఎన్. ఆర్.ఐ. సభ్యులు అందరూ కలిసి విరాళాలు సేకరించారు. సేకరించిన రూ. కోటి విరాళం చెక్కు రూపంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గురువారం వాళ్ళు అందజేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సమన్వయకర్తలు రాజేష్ మల్గా, శశిధర్ కొలికొండ, జనసేన నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, జగదీష్ హరిదాస్, జ్ఞానేశ్వర్ రావ్ పప్పుల, చందు గల్లా పాల్గొన్నారు.