Lokesh Yuva Galam Padayatra : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారో.. అప్పటినుంచి టిడిపి పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ప్రస్తుతం చంద్రబాబు కంటి ఆపరేషన్ నిమిత్తం మధ్యంతరంగా బెయిల్ తీసుకొని బయటకు వచ్చారన్న విషయం విధితమే. అయితే న్యాయస్థానం విధించిన కొన్ని ఆంక్షల నడుమ ఆయన ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దు.
ఇదిలా ఉంటే మరోవైపు చంద్రబాబుపై ఉన్న కేసులపై, క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. తమకు అనుకూలంగా తీర్పు వస్తే సరే.. లేదంటే మళ్లీ ఈ నెల 28వ తేదీన చంద్రబాబు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ టోన్, ఫైబర్ నెట్ కేసు, అంగళ్ళ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు ఇలా పెండింగ్ లో ఉన్న ఎన్నో కేసులు సంబంధించి ముందస్తు బెయిల్ లభించిన వాటి గడువు ముగియడంతో అన్ని కేసుల్లోనూ మళ్ళీ తిరిగి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ ఈ కేసులన్నిటిలో మద్యంతర బెయిల్ లభించినప్పటికీ రాజకీయ కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు నిర్వహించడానికి న్యాయస్థానం షరతులు విధించింది కాబట్టి బెయిల్ వచ్చిన చంద్రబాబుకు రాజకీయంగా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం తండ్రి కేసుల పరిస్థితి బెయిల్ దృష్ట్యా నారా లోకేష్ కి రాజకీయంగా దెబ్బ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేష్ పార్టీ భవిష్యత్తు కొరకు, తన తండ్రి కేసుల గురించి అటు ఢిల్లీ ఇటు రాజమండ్రి అంటూ తిరుగుతూ, బెయిల్ విషయాలు పట్టించుకుంటూ, కోర్ట్ విషయాలను ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ బిజీబిజీగా ఉంటున్నారు.
మరోవైపు నారా లోకేష్ పైన కూడా కేసులు ఉండడంతో, ఆయన వాటి గురించి కూడా సిఐడి ఎదుట విచారణకు హాజరు కావలసి ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకు తలకు మించిన భారం లాగే మారాయి. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన యువగలం పాదయాత్రకు విరామం ప్రకటించాల్సిందేమో అన్న అనుమానం టిడిపి శ్రేణులల్లో కలుగుతుంది. ఎందుకంటే యువగలం పాదయాత్ర మొదలుపెట్టడానికి అసలు సమయమే లోకేష్ దగ్గర ఉండడం లేదు. ఆయనకు ఆ యాత్రను కంటిన్యూ చేయాలని ఆశగా ఉంది. కానీ ఎక్కడ కూడా సమయం లోకేష్ కీ అనుకూలంగా లేదు.
మరోవైపు చూస్తే ఏపీలో ఎన్నికలకు ఇంకా 150 రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకవైపు లోకేష్ కి కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోతుంది. దీంతో ఇప్పట్లో ఆ యాత్ర గురించి లోకేష్ మర్చిపోవాల్సిందే యాత్రకు బ్రేక్ పడినట్టే అని సన్నిహితంగా ఉండేవారు, రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. లోకేష్ కనుక యువగలం యాత్ర తిరిగి ప్రారంభించాలంటే, చంద్రబాబు నాయుడుకి అన్ని కేసులలో బెయిల్ రావాడం ఒక్కటే మార్గం. కానీ పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలాగా కనిపించడం లేదు. కాబట్టి యువగలం పాదయాత్ర ఇక గల్లంతైనట్లే అని మనకు అర్థమవుతుంది.