తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటులు శ్రీ కైకాల సత్యనారాయణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యాను అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. సత్యనారాయణ గారితో తమ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
చెన్నైలో ఉన్నప్పటి నుంచి అన్నయ్య చిరంజీవి గారితోను, మాతోనూ ఆప్యాయంగా ఉండేవారని ఆయన అన్నారు. ఇటీవల ఆయనతో మాట్లాడాననీ. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నానీ జనసేనాని తెలిపారు. తెలుగువారికి యమధర్మరాజు అంటే శ్రీ సత్యనారాయణ గారే అనీ ఆ పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా చేశారనీ.. ఏ తరహా పాత్రనైనా ప్రేక్షకుల మెప్పు పొందేలా నటించారనీ పవన్ కళ్యాణ్ అన్నారు.
శ్రీ సత్యనారాయణ గారు లేని లోటు తెలుగు చిత్రసీమలో తీర్చలేనిది అంటూ కైకాల సత్యనారాయణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు పవన్ కళ్యాణ్..