Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత గుడ్లను సైతం తినేస్తుంది. తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి. ఈయన తన సొంత చిన్నాయనను మింగేశాడు.
దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పధకాలను రద్దు చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టాడు. ఈ ముఖ్యమంత్రి అంబేద్కర్ కంటే గొప్పవాడా? నాకు జెడ్ క్యాటగిరీ, పై క్యాటగిరీ సెక్యూరిటీ లేదు. ప్రభుత్వం ఇచ్చిన గన్ మ్యాన్ లేరు. నాకు రక్షణగా ఉన్నదల్గా వారాహి రధం, నా అన్నదమ్ములు, ఆడపడుచులు దీవెనలు మాత్రమే. నా మీద కానీ, జనసైనికుల మీద గానీ చిన్న చేయి పడ్డా, రాయి పడ్డా.
క్రిమినల్స్, బ్లేడ్, కత్తి బ్యాచ్ లకు ఒకటి చెబుతున్నాను జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఎక్కడున్నా వెతికి మరి బయటకు తీసుకొచ్చి మీ పని పడతాం. మాతో గొడవ పెట్టుకోవాలంటే 25 ఏళ్ల యుద్ధానికి సిద్ధమై మాత్రమే రండి అని పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకు హెచ్చరికలు పంపారు. రాజకీయం అంటే ఓ బాధ్యత, లక్షలాది మంది ఓటర్ల ఆకాంక్ష. కేవలం రాజకీయ స్వలాభం కోసం ఓ పార్టీ తరఫున గెలిచి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇతర పార్టీల్లోకి వెళ్లే రాజకీయం సరికాదు.
అందరి నిర్ణయం మీద గెలిచిన వ్యక్తి చివరి వరకు దానికి కట్టుబడి పనిచేయాలి. గెలిచిన ఒక్కడి నిర్ణయం పని చేయదు. ప్రజలు వేసిన ఓటును బోటుగా చేసుకొని ఎన్నికల సముద్రం దాటిన వ్యక్తి అవసరం తీరాక, ఆ తెప్ప తగలేస్తామంటే. ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ఖచ్చితంగా అలాంటి నాయకులను నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. రీకాల్ చేసే అధికారం ప్రజలకు చెందాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.