Varahi VijayaYathra : నరసాపురం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..హీరో ప్రభాస్ గారు బాహుబలి, ఆదిపురుష్ వంటి సినిమాలు చేస్తే ఒక రోజు షూటింగ్ కు 500 నుంచి 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపిస్తారు. ఎందరికో పరోక్ష ఉపాధి ఉంటుంది. వచ్చిన డబ్బుకు పన్నులు కట్టి నీతిగా పదిమందికి ఉపాధి చూపి సంపాదిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభాస్ కాదు.ఎలన్ మస్క్ అంతకంటే కాదు. మరి ఆయనకు ఇంత సంపద ఎక్కడ నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది.
అంటే తండ్రి సీఎం పదవిని అడ్డం పెట్టుకొని రకరకాల పైరవీలు చేసి సంపాదించిన అవినీతి సొమ్ము ఇది. తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని బెంగళూరు, ఇడుపుల పాయల్లో పంచాయితీలు చేస్తే వచ్చిన సంపాదన అది అని పవన్ కళ్యాణ్ జగన్ పై మండి పడ్డారు . హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు రాసిన పుస్తకంలో..ఈ ముఖ్యమంత్రి యవ్వన దశలో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ను కొట్టి, పోలీసు సెల్ లోనే వేసిన విషయం ప్రస్తావించారు. అలాంటి వ్యక్తికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారు.
డీజీపీ లాంటి అధికారులు ఆయన చేయిస్తున్న పనులకు వత్తాసు పలుకుతున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే బటన్ నొక్కాను… బటన్ నొక్కాను అని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రజావసర బటన్లు మాత్రం నొక్కకుండా వదిలేశాడు. పూర్తి కాని పోలవరం బటన్స్, ప్రతి ఏడాది ధాని ఉద్యోగ నోటిఫికేషన్ల బటన్, రైతులకు అందని పంట నష్టపరిహారం బటన్, కొబ్బరి రైతుకు దక్కని మద్దతు ధర బటన్,ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులకు దారి చూపని బటన్, దేవాలయాలపై
దాడులు చేసిన వారిని పట్టుకునే బటన్, పూర్తికాని వంతెనల బటన్స్, ఆక్వా రైతుకు యూనిట్ రూ. 1.50 ఇస్తామన్న హామీ బటన్, దళితులను చంపిన హంతకులపై కఠిన చర్యల బటన్.. అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ మూతపడిన ఎనిమిది వేల అవార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలను ఈ ముఖ్యమంత్రి గాలికి వదిలేసాడు అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.