Varahi Yatra Pithapuram : పవన్ వారాహి యాత్ర పిఠాపురం సభ ముఖ్యంశాలు ఇవే..
- పిఠాపురం రావడం …సాక్ష్యాత్తు దత్తాత్రేయుడు పుట్టిన ఊరికి రావడం నేను చేసుకున్న అదృష్టం…
- ధర్మపరిరక్షణ, ప్రజాభివృద్ధి, పరివర్తన ఉద్దేశించి యాగం చేసి వారాహి విజయ యాత్ర మొదలుపెట్టాము..
- దశాబ్దం పాటు నేను నిలబడింది మీ భవిష్యత్తు కోసం…. మీ బిడ్డల భవిష్యత్తు కోసం…
- పవన్ కళ్యాణ్ పార్టీని నడుపుతున్నాడంటే కార్యకర్తలే నా బలం… నా కడశ్వాస వరకు మీ కోసం పని చేస్తూనే ఉంటాను…
- శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన ఈ పిఠాపురం నేల మీద ధర్మపరిరక్షణ అంటే సనాతన ధర్మాన్ని, వేదాలని నేర్చుకుని ఈ నేలపై చాటుతున్న బ్రాహ్మణులకి పాదాభివందనం. అన్నీ మతాలని సమానంగా చూడమని చెప్పిన ఈ నేల గొప్పది..
- నేను మతపిచ్చి ఉన్నవాడిని కాదు…. ధర్మం వైపు ఉండే వాడిని… హిందూ దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం చేశారు ఇక్కడ… ఎవరు చేసారు ఇది??? ఎవడో గుర్తింపు కోరుకునే వాడు చేసాడా అనుకున్నాను…కానీ పిచ్చివాళ్ళు చేసారు అని రాష్ట్రమంతటా అదే కథ అల్లారు ఈ వైసీపీ ప్రభుత్వం.
- వేరే మతస్తులు చేసారు అని దేవాలయాల ధ్వంసం అడ్డుపెట్టుకుని మతకలహాలు సృష్టించే కుట్ర చేసిన ఈ జగన్ రెడ్డి…సనాతన ధర్మాన్ని పాటించే 279 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్కడిని కూడా పట్టుకోలదు ఈ చచ్చు ప్రభుత్వం.
- ఏం చేస్తున్నారు దేవాలయాల ధ్వంసం జరుగుతుంటే అని పోలీసులని ఒంగోలులో అడిగాను. మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి సార్ విచారణ చేయొద్దని పోలీసులు అన్నారు. మతాల మధ్య సయోధ్య చెడగొట్టి చోద్యం చూస్తున్న వైసీపీ.
- జనసేన ప్రభుత్వం రాగానే 279 దేవాలయాల ధ్వంసం మీద విచారణ మొదలుపెడతాం
- గొల్లప్రోలు లో కూర్చుని పురప్రముఖులను కలుస్తుంటే వైసీపీ అరాచకాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి.
- తాడేపల్లిలో జగన్ రెడ్డి ఇంటి ముందు రోడ్ విస్తరణ కోసం ఇళ్ళు కొట్టేస్తే గ్రామసచివాలయ ఉద్యోగిని ఇంటిని కూడా కూల్చేసారు… నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ సమస్య చెప్పుకునేందుకు పవన్ కళ్యాణ్ ని కలిసినందుకు తన అన్నని చంపేసారు. ఒక్క పోలీసు కూడా మాట్లాడలేదు. ఇది క్రిమినల్స్ కి అడ్డాగా చేసారు. వైజాగ్ ఎంపీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసారు. గంజాయి రాజ్యం చేసారు.
- ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చేసారు వైసీపీ వాళ్ళు. 2024 లో జనసేనను గెలిపించండి. ఈ రౌడీ రాజ్యాన్ని తరిమి సురక్షిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చుదిద్దుకుందాం.
Varahi Yatra : పవన్ వారాహి విజయ యాత్ర మొదటి రోజు ముఖ్యాంశాలు ఇవే..
- లా అండ్ ఆర్డర్ ని ధ్వంసం చేసారు..ఎంపీని కొడతారు. నిజాయితీపరులైన పోలీసులని ముందు పెట్టి ఈ పరిస్థితిని జనసేన రాగానే చేస్తాం.
- జనసేన అధికారంలోకి రాగానే పిఠాపురం నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా మారుస్తాం.. పుణ్యక్షేత్రాలు ఉన్న నేల ఇది.
- తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి అడ్డంగా దోచేసారు. నామరూపాలు లేకుండా పోతారు వైసీపీ వాళ్ళు. జాగ్రత్త..
- గొల్లప్రోలు గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక.. నీళ్ళు కలుషితమై తీవ్ర అనారోగ్యం ప్రబలుతోంది.
Pawan Kalyan : జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేద్దాం : పవన్ కళ్యాణ్
- అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి బయట నా చెప్పులు విప్పితే ఎవడో కొట్టేసాడు. వాడు ఎవడో మరి చెప్పులు తిరిగొచ్చేయాలి నావి.
- శ్రీపాద శ్రీ వల్లభుడు సాక్షిగా వైసీపీ క్రిమినల్ గాళ్ళని గుడ్డల విప్పించి కొడతాను. అధికారంలోకి రాగానే ఈ గూండా గాళ్ళకి నేనేంటో చూపిస్తా.
- ప్రశ్నించిన వాళ్ళని పిచ్చివారిని చేసే ఈ ప్రభుత్వాన్ని మట్టిలో వేసి తొక్కుదాం.
- పిఠాపురం నియోజకవర్గంలో మట్టిని తోలుకొని పోయే వాళ్ళు అడ్డుకున్న వాళ్ళని తుపాకులతో బెదిరిస్తున్నారు కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు.
- షణ్ముఖ వ్యూహంతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి జనసేన ప్రభుత్వం రావాలి.
- క్రిమినల్స్ ని ఎన్నుకుంటే తుపాకులే తీస్తారు, దౌర్జన్యం చేస్తారు.
- సిల్క్ రైతుల కోసం నేను వెళ్తుంటే వాళ్ళని బెదిరించి ఆపేసే చర్యలు చేసారు.
- పబ్లిక్ పాలసీలని అర్థం చేసుకున్న వాడిని, మొదటిసారి అడుగుతున్నాను.. “ముఖ్యమంత్రి కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంపూర్ణంగా నాకు అధికారం ఇవ్వండి. ముఖ్యమంత్రిని చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాను”
- వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర బాధ్యతలు తీసుకోడానికి సంసిద్ధంగా ఉన్నాను.
- నాణ్యమైన కరెంట్ అని చెప్పి 10 నిముషాలకు ఒకసారి కరెంట్ తీస్తున్నాడు…ఇది ఈ యెదవ పాలన..
– Rahul Rayavarapu
Discussion about this post