YCP Position Among People : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అంతర్గతంగా చేసే సర్వేలు కొన్ని జరుగుతాయి. దాంట్లో ఏ, ఏ పార్టీకి ప్రజల్లో ఎలాంటి మద్దతు ఉందని విషయాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ప్రజల్లో ఉన్నటువంటి స్థానమెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో జనసేన, టిడిపి పొత్తుగా రంగంలోకి దిగుతుండగా, వైసిపి మాత్రం ఒంటరిగానే తన సత్తా చాటడానికి రెడీ అయింది.
అయితే ఇప్పటికే జనసేన, టిడిపి కలిసి వైసిపి పైన దండయాత్ర చేస్తున్నాయని చెప్పవచ్చు. మరో రకంగా చెప్పాలంటే వైసిపి నాయకులకు ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో వైసీపీలో కొన్ని గందరగోళ అంశాలు కూడా ఉన్నాయి. ఆ పార్టీ నాయకుల్లో సామరస్యత కరువైందని బహిర్గతమవుతుంది. దీనికి రుజువుగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి టికెట్ల కేటాయింపు విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నాయకులను మరింత గందరగోళానికి నెట్టేస్తున్నాయి.
విడ్డూరంగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం జగన్మోహన్ రెడ్డి పక్కకు తప్పిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి కొంతమందేమో గెలుపే ప్రామాణికంగా జగన్ ముందడుగు వేస్తున్నారని చెబుతున్నారు. 175 స్థానాల్లో గెలుస్తామని ధీమాను జగన్ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది వినడానికి కాస్త అతిశయోక్తిగా ఉన్నప్పటికీ, ఎవరి పార్టీ మీద వారికి ఇలాంటి నమ్మకం ఉండడం అనేది సహజం. ఇక ప్రజల విషయానికి వస్తే వైసిపి గురించి మరో భిన్నమైన అభిప్రాయం వినబడుతుంది.
జగన్మోహన్ రెడ్డి విభిన్నంగా ఆలోచిస్తున్నారు. సీట్ల కేటాయింపులో కీలకమైన నేతలను పక్కకు పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తున్నప్పుడు, అభ్యర్థులు ఎవరైనప్పటికి కూడా ప్రజల ఓట్లు మాత్రం పార్టీని చూసే ఉంటాయి. పార్టీ చేసిన అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని విశ్వసిస్తున్నారు. కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయ సేకరణ మాత్రం వేరే రకంగా ఉంది.
వైసీపి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనడానికి ఇక్కడ రెండు ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. పట్టణాల్లో వైసీపీకి పూర్తి వ్యతిరేకత ఉందనేది తెలుస్తుంది. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి పట్టణాల్లో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఈ విషయంలో ప్రజల నుండి పూర్తి వ్యతిరేకత ఉంది.
ఉద్యోగస్తుల్లోనూ వైసీపీకి వ్యతిరేకత కనిపిస్తుంది అంటే వైసిపి పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, తమ ప్రయోజనాలను వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగుల స్థితిగతులు మారిపోయాయి. సంక్షేమ పథకాల పేరుతో ఖజానా అంతా ఖాళీ చేశారు.
తమ గురించి ఏమాత్రం ఆలోచించలేదని వారు వాపోయారు. రేషన్ కార్డు మొదలు పించను, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక వంటి విషయాల్లో తమ ప్రమేయం లేకుండానే వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని ప్రజలకు అందడం కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించిన అంశాలు. వైసిపి పరిపాలనలో అతి సాధారణమైన విషయాలు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వైసీపీ కి పెద్దదేబ్బ లాగా మారింది.
ముఖ్యంగా పట్టణ ప్రజల కనీస అవసరాలు అయినటూవంటి మురుగు సమస్య, విద్యుత్ చార్జీల సమస్య, ఇంటి పన్ను, చెత్త పన్ను, రహదారుల మరమ్మతుల వంటి విషయాల్లో వైసిపి ఏమాత్రం చొరవ చూపకపోవడం, అభివృద్ధి చేయకపోవడం పట్టణ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నెలకొల్పింది.
మరోవైపు అంతర్గతంగా చేసిన సర్వేలలో ప్రజలు వైసిపి వైపే మొగ్గుచూపుతున్నారు. అందవలసిన సంక్షేమ పథకాలన్నీ వారికి అందాయి అని ఒక ప్రచారాన్ని లేవనెత్తారు. కానీ ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. పట్టణ వాసుల నుండి వైసీపీ పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఈ రకంగా చూసుకుంటే జగన్ గెలుపు తమదే అని ధీమాలో ఉన్న జగన్ కు కచ్చితంగా చుక్కెదురు అవుతుంది అనడంలో అనుమానం ఏమాత్రం లేదు..