Janasena Formation Day : వారాహి – మార్చి 14 న చేరుతుంది బందరు.. జయప్రదం చేయగ రారండి అందరూ..
• 34ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు
• పార్టీ ఆవిర్భావ వేదికకు పొట్టి శ్రీరాములు వేదికగా నామకరణం
• మహనీయులు గురించి చాటి చెప్పేలా.. సభా ప్రాంగణం
• మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్యను గుర్తు చేసుకుంటూ.. కార్యక్రమాలు
• మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంలో చేరుకుంటారు.
• రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం
రాజకీయ రణంలో నిలబడి ఎన్నికలలతో ప్రజల కలను తీర్చటానికి చిరునవ్వులతొ కదిలిన అతనొక అవకాశం.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరో 13 నెలల్లో రానున్నాయి.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించనున్నారు.
వారాహి ఆన్ని దిక్కులను కాచే అమ్మవారి గా పురాణాలు చెబుతున్నాయి . సమాజం లోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే జనసేనాని వారాహి ని ప్రచార వాహనంగా వినియోగించుకోవడంలోని ఆంతర్యం
రాజకీయ కీలక కేంద్రం ఎంచుకోవడం వెనుక మర్మం.. మచిలీపట్నం చాలా కీలకమైన నియోజకవర్గం. ఈ సెగ్మెంట్తో పాటు పక్కన ఉన్న పలు నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతోంది. . మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని ఆధిపత్యం . ఈ సీనియర్ నేత నియోజకవర్గంలోనే ఆవిర్భావ సభ విజయవంతం చేయడం ద్వారా ప్రజల్లోకి సంకేతాన్ని పంపటం ఓ ఎత్తుగడే అని చెప్పాలి. తాను కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే నేతను కాదనే వివరణ ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
వంగవీటి రాధా జనసేనలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయన బందరు వేదిక గా పార్టీలోకి జాయిన్ అవుతారు అన్న ప్రచారమూ జరుగుతోంది..ఈ క్రమంలో తాజాగా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని బి.జె.పి వ్యూహానికి ప్రతివ్యూహమా అన్న చర్చ కాక రేపుతోంది. అదీగాక MLC ఎన్నికల్లో మిత్రపక్షం గా ఉన్న బిజెపి కి ఓట్ వేయమని పిలుపు ఇవ్వకుండా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని జనసేన పిలుపు ఇవ్వడం బట్టి చూస్తుంటే బి.జే.పి తో పొత్తు అనుమానమే..
కీలక ప్రకటన చేస్తారా?
అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేందుకు జనసేనాని పొత్తుల ఎత్తులు ఎలావుంటాయి అన్న దానిపై కార్యకర్తలు , అభిమానులు ,జనసేన పార్టీ సానుభూతిపరులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే కృష్ణా, గోదావరి జిల్లాలలో జన సేన బలమైన ఓటుబ్యాంక్ వున్నట్లు గత ఎన్నికల గణాకాంలు సూచిస్తున్నాయి ఆ ఓటు బ్యాంక్ అనుకూల ఫలితాన్ని తెచ్చే విధంగా జనసేన అభ్యర్దుల ఎంపిక, స్దానిక వ్యూహాలు ఉండాలి. జిల్లా కేంద్రంగా వున్నా అభివృద్ధికి ఆమడదూరం అన్న బందరు స్దానిక సమస్యల గూర్చి ప్రస్తావించడం సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ, బందరు పోర్టు పై స్పష్టమైన ప్రకటన, పోర్టు అభివృద్ది భూనిర్వాసిలకు నష్ట పరిహారం, మత్స్యపరిశ్రమ అభివృద్ధి, పెడన కలంకారీ కళాకారుల కష్టాలు, ఆ పరిశ్రమ అభివృద్ధికి తోట్పాటు. అలాగే పర్యాటక ప్రాంతంగా అభివృద్ది పై ప్రకటన.. గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు అసరా.. అలాగే కార్మికుల మెరుగైన సౌకర్యాలు గూర్చి హామిలు.. ప్రకటనలు.. జనసేనాని అవిర్బావ దినోత్సవ సభలో చేస్తారు అని ఎదురు చూస్తున్నారు. రాజకీయ పరిణామాలు ప్రభుత్వ పని తీరు ఎండగట్టటంతో పాటు ఆ ప్రాంత్ర సమస్యలపై దృష్టి సారిస్తే అనూహ్య ఫలితాలు వస్తాయి. అలాగే భావ ప్రకటన హుందాగా వ్యక్తిగత విమర్శలకు దూరంగా కొనసాగిస్తే వైసిపీ వ్వాజమ్మల బాజాల మోత సద్దుమణుగుతుంది.
Discussion about this post