New Bride : ఈ మధ్య కాలంలో కొందరు అవగాహన లేకుండా చేసే పనుల కారణంగా నిష్కారణంగా ఇతరుల ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేగాకుండా వైవాహిక జీవితంలో సౌమ్యంగా వ్యవహరించాల్సిన సమయంలో కఠినంగా వ్యవహరిస్తూ కట్టుకున్నవారిని కాటికి చేరుస్తున్నారు. కాగా తాజాగా ఓ వ్యక్తి తన భార్యతో ఫస్ట్ నైట్ రోజు తన భార్యతో ప్రవర్తించిన తీరు కారణంగా కాళ్ళ పారాణి ఆరకముందే నవ వధువు కన్ను మూసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తీ వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని హమీర్ పూర్ ప్రాంతంలో ఉడతై పరిధిలో సురేష్ జాదవ్ (పేరు మార్చాము) యువకుడు తన కుటుంబ సభ్యులతో కలసి నివాసం ఉంటున్నాడు. అయితే సురేష్ జాదవ్ ఇంజినీరింగ్ చదువు పూర్తీ చేసాడు. దీంతో యివలె స్థానికంగా ఉంటున్న ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇక కొడుకు చదువు పూర్తీ అవ్వడం అలాగే ఉద్యోగం కూడా చేస్తుండటంతో తమ కొడుకుకి పెళ్లి చెయ్యాలని సురేష్ జాదవ్ తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో తమ సమీప బంధువులలో సురేష్ జాదవ్ కి తగిన ఓ యువతిని ఇచ్జి ఇటీవలే వివాహం జరిపించారు. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది. అయితే సురేష్ జాదవ్ కి తన శోభనం రోజుపై ఎక్కువగా ఆశలు ఉండేవి . ఈ క్రమంలో సినిమాల్లో చూపించినట్లు ఎక్కువ సేపు తన భాగస్వామితో గడపాలని అనుకున్నాడు.
స్టామినా కోసం వయాగ్రా బిల్లలు పరిమితికి మించి
దీంతో ఏకంగా స్టామినా కోసం వయాగ్రా బిల్లలు పరిమితికి మించి వాడాడు. దీంతో సురేష్ జాదవ్ తన భార్యతో మొదటి రాత్రి ఎక్కువసేపు గడిపాడు. కానీ వధువు కి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఇది గమించిన సురేష్ జాదవ్ తల్లిదండ్రులు వధువుని దగ్గరిలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ వధువుకి రక్తస్రావం మాత్రం తగ్గలేదు. దీంతో ఇటీవల వధువు భరించలేని నొప్పి మరియు తీవ్ర రక్తస్రావం కారణంగా కన్నుమూసింది. పోస్టుమార్టం చేసిన డాక్టర్లు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా వధువు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. అలాగే తమ కూతురి మరణానికి కారణమైన సురేష్ జాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకి ఫిర్యాదు చేసి కోరారు. అయితే సురేష్ జాదవ్ ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ముందుగా ఎక్కువసేపు తన భార్యతో గడిపేందుకు పరిమితికి మించి వయాగ్రా బిళ్ళలు వాడినట్లు నిజం ఒప్పుకున్నాడు. దీంతో పలు సెక్షన్ల కింద సురేష్ జాదవ్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.
నూరేళ్లు జీవితం బలి:
కేవలం సురేష్ జాదవ్ అవగహన లేకుండా చేసినటువంటి పని కారణంగా నూరేళ్లు తనతో జీవితం పంచుకోవాల్సిన తన భార్య కాళ్ళ పారాణి ఆరకముందే కాటికి వెళ్ళింది. దీంతో కొందరు డాక్టర్లు ఈ విషయంపై స్పందిస్తూ శక్తి సామర్థ్యం పెరిగేందుకు అవగాహన లేకుండా వయాగ్రాలు వాడొద్దని సూచిస్తున్నారు. లేదంటే ఒక్కోసారి హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.