జనం చూపు జనసేన వైపు.. అమాంతం పెరిగిన జనసేన గ్రాఫ్ :
రాష్ట్ర ప్రజల చూపు ఒక్కసారిగా జనసేన వైపు టర్న్ తీసుకుంది.. నెల రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. వైజాగ్ పరిణామాలు ఐతేనేమి.. తర్వాత జరిగిన ఇప్పటం సంఘటనలు తో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇప్పటి వరకూ జగన్ ని ఎదుర్కోవాలి అంటే టీడీపీ జనసేన కలిస్తేనే అంటూ మాట్లాడిన జనంలో ఇపుడు మార్పు కనిపిస్తుంది. ఇపుడు ఎక్కడ చూసినా “నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కీ ఒక అవకాశం ఇవ్వాలి” అనే మాటే వినిపిస్తుంది.
గత ఎలక్షన్స్ లో “ఓ సారి జగన్ ని చూడాలి” అన్నవాళ్లే ఇపుడు “ఈ సారి పవన్ కి చేద్దాం” అంటున్నారు :
కామన్ people మైండ్ లో ఒకసారి ఫిక్స్ అయితే వాళ్ళను మార్చడం ఎవడి వల్లా కాదు.. వాళ్లు ఒక్కడికి అని ఫిక్స్ అయితే వాళ్ళ గెలుపును ఆపడం కూడా అంతే.. ఎందుకంటే జనంలో ఎక్కువ పర్సెంట్ సంఖ్య వీళ్లదే.. లాస్ట్ ఎలక్షన్స్ లో వీళ్ళలో ఎక్కువ శాతం “జగన్ ని ఒకసారి చూడాలి” అనే మాట వినిపించేది..కొద్ది రోజుల క్రితం వరకూ ఎవర్ని అడిగినా “జగన్ ని కొట్టాలి అంటే టీడీపీ జనసేన కలిస్తేనే..” అనే వాళ్ళు.. ఇపుడు మాత్రం “ఈ సారి పవన్ కి చేద్దాం..” అంటున్నారు.
జగన్ ని ఎదుర్కోవడంలో టీడీపీ ఫెయిల్.. జనసేన సక్సెస్ :
టీడీపీ గత మూడేళ్ళుగా ప్రజల్లో లేకపోవడం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండీ జనసేన కార్యకర్తలే ఎక్కువ జనంలో ఉంటూ ప్రభుత్వాన్ని గానీ లోకల్ నాయకుల అన్యాయలనూ అక్రమాలనూ ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చిన అంశం. దీనితో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వార్ జనసేన vs వైసీపీ గానే ఉంది. ప్రజల్లోకి కూడా విషయం అలానే వెళ్ళింది. ఇపుడు తాజా రాజకీయ పరిణామాలు కూడా దాన్నే మరింత ప్రజల్లోకి వెళ్లేలా చేసింది. వైజాగ్ విషయంలో గానీ తాజాగా ఇప్పటం విషయం గానీ పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న తీరు ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ పై చేయి సాధించడం లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు అనే చెప్పవచ్చు.
విశాఖ.. ఇప్పటం సంఘటనలతో పవన్ పై జనంలో విపరీతమైన గురి :
దీనికి తోడు విశాఖ ఘటనల తర్వాత చంద్రబాబు ఆఘమేఘాల మీద స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలవడం కూడా టీడీపీ కి మైనస్ అయి జనసేనకు ప్లస్ అయింది. చంద్రబాబు ఒంటరిగా జగన్ ని ఎదుర్కోలేక చేతులెత్తేసినట్టు ప్రజలకి అర్ధం అయింది. స్వయంగా చంద్రబాబుకి అసెంబ్లీలోనే అవమానం జరిగితే వైసీపీని ఎదుర్కోలేక కన్నీళ్లు పెట్టుకుంటే ఇప్పటం లో జనసేన సానుభూతి పరుల ఇళ్లను కూల్చివేస్తే అధినేత స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వం నిలువరించడానికి ఎంత ప్రయత్నించినా లెక్క చేయక ఇప్పటం వెళ్లిన వైనం చూసిన జనానికి “జగన్ ని ఎదుర్కోవాలి అంటే పవన్ వల్లనే అవుతుంది” అనే విషయం స్పష్టంగా అర్ధం అయింది.
రాయలసీమ తోనే జనసేన కు సమస్య.. బలిజలు తోడుండేనా..?
ఇపుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జనసేన అనే పేరే వినబడుతుంది. పవన్ కళ్యాణ్ ఇలానే ముందుకు వెళితే జనసేనదే నెక్స్ట్ అధికారం అనడం లో ఎలాంటి సందేహం లేదు.. ఎటొచ్చీ రాయలసీమ తోనే జనసేనకు సమస్య. కొన్ని నియోజకవర్గాలలో బలంగా ఉన్నప్పటికీ చాలా నియోజకవర్గాలలో ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఒకవేళ రాయలసీమ నుండి బలిజ సామాజిక వర్గం జనసేన కు అండగా నిలబడితే ఇక్కడ కూడా జనసేన ప్రభావం చూపడం పెద్ద సమస్య కాకపోవచ్చు.
Discussion about this post