స్టేట్ పోలిటికల్ సినారియోపై గతంలో ఎన్నో రాజకీయపార్టీల సమరం మనం చూసిందే. బట్ ఫస్ట్ టైమ్ వైసీపీ × జనసేనల మధ్య జరుగుతున్న ఎత్తుకు పై ఎత్తుల నయా రాజకీయం ఆయా పార్టీల కార్యకర్తల మధ్యనే కాకుండా సామాన్య ప్రజలలో కూడా ఆశక్తి రేపుతుంది.
పబ్లిక్ లో మాస్ పొలిటిషియన్ గా పేరు తెచ్చుకున్న జగన్ ఒకవైపు, తన సినిమాటిక్ పంచ్ లతో విరుచుకు పడుతూ, వైసిపి నాయకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గ్లామరస్ లీడర్ పవన్ కళ్యాణ్ మరోవైపు చేస్తున్న ఈ బ్యాటిల్ ఇప్పడు మరో సరికొత్త టర్న్ తీసుకుంది.
సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే బస్సు యాత్ర కోసం సిద్దం చేసిన “వారాహి” అనే వాహనాన్ని అడ్డుకోవడానికి వైసీపి చాలా ప్రయత్నాలు చేసింది. ఈ వాహనం గురించి జనసేన వీడియో విడుదల చేసిన మరుక్షణం నుండీ వైసిపి క్యాడర్ మొత్తం మెకానికల్ రంగంలో నిష్ణాతుల మాదిరిగా చెలరేగి, వాహనానికి వేసిన రంగు మొదలు కోని టైర్ల వరకూ ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతూ రచ్చ రచ్చ చేసారు.
ప్రతి విషయంలోనూ పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే వైసిపి మంత్రులు మరొక అడుగు ముందుకు వేసి ప్రాసలు, పంచులతో విరుచుకు పడ్డారు. ఆ వాహనం రోడ్డు ఎలా ఎక్కుతుందో చూస్తామంటూ మీడియా మైకుల ముందు చోక్కాలు చించుకున్న పరిస్థితి. కానీ వారందరినీ పోలిటికల్ జోకర్ లను చేస్తూ ఆ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియని జనసేన వర్గాల ద్వారా తెలంగాణలో దిగ్విజయంగా పూర్తి చేయించి వైసీపీకి పెద్ద షాకే ఇచ్చారు పవన్..
గత వారం రోజుల నుండీ ఈ ప్రక్రియ జరుగుతున్నా ఎక్కడా సమాచారం లీక్ అవకుండా ఒక సీక్రేట్ ఆపరేషన్ లా ఈ వ్యవహరం నడిచింది. సినిమాల్లో మాదిరి మైండ్ గేమ్ తో కూడిన అడుగులు వేసిన పవన్ ఎత్తుకి వైసీపీ అగ్ర నేతలు మొదలుకొని సోషల్ మీడియా వింగ్ వరకూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కానీ వెంటనే తెరుకోన్న వైసీపీ మంత్రులు రిజిస్ట్రేషన్ తెలంగాణలో అయినా ఏపీలో రూల్స్ పాటించాల్సిందే అంటూ అధికార దర్పం చూపిస్తూ స్టెట్ మెంట్ లు పాస్ చేస్తున్నారు.
ఇటు జనసేన క్యాడర్ మాత్రం ఈ పోలిటికల్ విక్టరీని సెలబ్రెట్ చేస్తూ సోషల్ మీడియాలో మంత్రుల సెన్స్ లేస్ స్టెట్మెంట్ లను ఉదహరిస్తూ ట్రోలింగ్ ని పతాక స్దాయికి తీసుకువెళ్లారు.