అంత అన్నాడు… ఇంత అన్నాడు… మేము అధికారంలోకి వచ్చాక లెక్క తెలుస్తాం అన్నాడు. తీరా అధికారం వచ్చాక తుస్సుమన్నాడు.
టిడిపి హయాంలో ఆరు లక్షల పదిహేడు వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నాడు. పూర్తి లెక్కలు ఉన్నాయి. పూర్తి ఆధారాలు ఉన్నాయి. సాక్షాలు ఉన్నాయి. అని పుస్తకాలు వేసి మరీ పంచాడు. అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని చెప్పాడు.
అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్ళు అయింది. టీడీపీ మీద చర్యలు ఏవి..? అపుడు అచ్చేసిన పుస్తకం అబద్ధం అయితే కాదు.. ఎందుకంటే టీడీపీ హయాం లో విపరీతమైన అవినీతి జరిగింది అనేది అందరికీ అర్ధం అయిన సంగతే. టీడీపీ ఘోరంగా పతనం అవ్వడానికి ఈ అవినీతి కూడా ఒక కారణం. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి కుంభకోణం జరిగిందని, విశాఖ లో లక్ష ఎకరాలు భూమి మాయమైందని ఇరిగేషన్ తో సహా అన్నిటి అవినీతి జరిగిందని చంద్రబాబు అవినీతి చక్రవర్తి అనే పుస్తకం కూడా ప్రచురించింది వైయస్సార్ సిపి పార్టీ.
తన స్వహస్తాలతో విడుదల చేసిన అవినీతి చక్రవర్తి అనే బుక్ లెట్ లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి గురించి, జీవో నెంబర్లతో సహా ప్రచురించామని మీడియా మైకుల ముందు ఆవేశంతో ఉగిపోతూ చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా, ఆ పుస్తకంలోని జీవోలను, జరిగిన అవినీతిని ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. టీడీపీ నాయకులపై చర్యలు లేవు. ఎందుకు..?
మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్ ఈ విషయం పై ఎందుకు మాట తప్పారు..? ఎందుకు మడం తిప్పారు..? ప్రజల సొమ్ము దోచుకున్న టీడీపీని ఎందుకు వదిలేశారు.. ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది.. ప్రశ్నించాల్సిన తరుణం ఇది..
ఇపుడు ఇదే మాట టీడీపీ చెబుతుంది.. వైసీపీ పాలనలో అవినీతి అని అందుకుంది..ఇంకా ఎన్నాళ్ళు ఈ రెండు పార్టీ ల డ్రామాలు..? వీళ్ళను నమ్మే జనం పిచ్చోళ్ళు..
