Special Story by Director Rajamouli : డైరెక్టర్ అవ్వాలనే కలను సార్ధకం చేసుకోవాలంటే అహర్నిశలు కష్టపడాలి. దానితోపాటు కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని ఎవరు అంతగా పట్టించుకోకపోయేది. అందరూ చూపు బాలీవుడ్ పైనే ఉండేది. రీమేకులు కూడా అక్కడి నుండే వచ్చేవి. ఆ రిమేకులతోనే తెలుగు హీరోలు సక్సెస్ ని అందుకుంటున్నారనే పేరు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఉంది.
కానీ అన్ని కాలాలు ఒకేలాగా ఉండవు కదా.. కాలాల్లో మార్పుల్లాగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా మార్పు మొదలైంది. ఆ మార్పుకు మెయిన్ అంబాసిడర్ గా రాజమౌళిని చూపించవచ్చు. ఎందుకంటే రాజమౌళి రాకముందు తెలుగు సినీ ఇండస్ట్రీ పరిస్థితి, రాజమౌళి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ పరిస్థితి అని రెండు అంచలుగా మనం మాట్లాడుకోవచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టిన ఘనత రాజమౌళికే దక్కుతుంది.
ఒకరకంగా చెప్పాలంటే పాన్ ఇండియా అనే ట్యాగ్ ని తీసుకొచ్చింది కూడా రాజమౌళి అనే చెప్పవచ్చు. అప్పటివరకు మన తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ మాత్రమే. వచ్చిన సినిమాలు చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం ఇక్కడవరకే పరిమితమైయేది. సినిమాలు వచ్చాయా చూసామా అన్నట్టు గా ఉండేది పద్ధతి. కానీ రాజమౌళి వచ్చిన తర్వాత పద్ధతి మారింది. ఎప్పుడెప్పుడు ఆయన సినిమా వస్తుందా అన్నట్టుగా ఆత్రుతను ప్రేక్షకుల్లో తెచ్చిన డైరెక్టర్ రాజమౌళి అని చెప్పవచ్చు.
అంతకుముందు సినిమా అంటే నాలుగు పాటలు, ఐదు ఫైట్లు, స్టోరీ, హీరో, హీరోయిన్ ఈ విధంగా సాగేది. కానీ రాజమౌళి వచ్చిన తర్వాత తెలుగు సినీ కథ వేరే మలుపు తిరిగింది. ఊహించని కథాంశాలను తీసుకొని వాటిని అద్భుతంగా తెరకెక్కించడంలో రాజమౌళి దిట్ట. పాత్రలను ఎంచుకోవడంలో కూడా ఆయన ఆచితూచి అడుగులు వేస్తారు. ఒక్కో పాత్ర స్క్రీన్ మీద చూస్తుంటే మనకు ఆ పాత్రలో లీనమైనామా అన్నట్టుగా ఉంటుంది. అలా చూపించడంలో రాజమౌళి అందజేసిన చెయ్యి.
ఆయన నెక్స్ట్ సినిమా రాబోతుంది అంటే అందులో స్టోరీ విభిన్నంగా ఉంటుందని మనం ఊహించేసుకోవచ్చు. ఒక లైన్ స్టోరీని చాలా రకాలుగా మార్చి ప్రేక్షకులకు దగ్గరగా తీయడంలో రాజమౌళిది పర్ఫెక్ట్ డైరెక్షన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏళ్లగా వస్తున్న పరంపర కూడా మారిందనే చెప్పవచ్చు. బాలీవుడ్ హీరోలు కాస్త టాలీవుడ్ సినిమాలను రీమేక్ చేసే అంత దిశగా టాలీవుడ్ ఇండస్ట్రీ మారిందంటే, అందులో డైరెక్టర్ రాజమౌళిది కీలక పాత్ర. అలా తెలుగు సినీ ఇండస్ట్రీ ని తీసుకువెళ్లి ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన మహానుభావుడు.
కానీ అలాంటి రాజమౌళిని ఇంకా ఎవరూ ఢీకొట్టలేరు అనుకుంటున్న తరుణంలో కొత్త డైరెక్టర్ లు వరుస విజయాలను అందిస్తూ, కొత్త స్టోరీలతో ముందుకు వస్తూ, మేము మా సత్తా చాటుతాము అన్నట్టుగా మారారు. వాళ్లలో ముఖ్యంగా ప్రశాంత్ నీల్, ఆయన తీసిన కేజిఎఫ్ సినిమా ఎంత భారీ సంచలనాన్ని అందించిందో చూడవచ్చు. అలాగే సందీప్ రెడ్డి వంగ ఇతను తీసినవి తక్కువ సినిమాల అయినప్పటికీ కూడా అవి సెన్సేషనల్ అంటే ఆయన ప్రేక్షకులను నాడిని ఎంత కరెక్ట్ గా పట్టుకున్నాడో అంచనా వేయవచ్చు.
రాజమౌళి రికార్డింగ్ బ్రేక్ చేసే సత్తా సందీప్ రెడ్డి వంగకు ఉందని చాలామంది మాట్లాడుకున్నారు. యానిమల్ మూవీతో ఆయన ఒక రేంజ్ లో ఎదిగిపోయారని చెప్పవచ్చు. యానిమల్ మూవీ ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ సక్సెస్ ని అందించింది. పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగిపోయిన సినిమా. అయితే రాజమౌళికి పోటీ లేదనుకుంటున్న తరుణంలో ఇలాంటి డైరెక్టర్స్ ప్రభంజనాలు సృష్టించి రాజమౌళికి గట్టి పోటీ ఇస్తున్నారు.