Yuva Galam Padayatra – నారా లోకేష్ పాదయాత్ర : ఆదిలోనే అపశృతి..!!
నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన పాదయాత్రలో మొదటి రోజునే అపశృతి చోటు చేసుకుంది.
ఉదయం లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారక రత్న ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు.వెంటనే టిడిపి శ్రేణులు ఆయన్ని కారులో హుటాహుటిన కుప్పంలోని కేసి హాస్పిటల్కి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం కుప్పంలోని పీఈఎస్ హాస్పిటల్కి తారక రత్నను తరలించారు(Taraka Ratna Heart Attack).గుండెలోని వాల్వ్స్లో అడ్డంకులు ఉండడం వల్లే తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్ అయిందని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు..ఇదిలా ఉంటే తారక రత్నను చూసి పరిస్థితి తెలుసుకునేందుకు నందమూరి బాలకృష్ణ పీఈఎస్ హాస్పిటల్కి చేరుకున్నట్టు సమాచారం.
Also Read : ప్రతిపక్ష నాయకుని స్థాయి దాటలేకపోతున్న జగన్
ఏదేమైనా లోకేష్ పాదయాత్ర మొదలైన మొదటి రోజునే ఇలాంటి సంఘటన జరగడంతో తెదేపా శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు.
– ప్రద్యుమ్న
Discussion about this post