Samantha Ruth Prabhu : ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నార్త్ లో క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు వచ్చాయి. మరోవైపు పుష్పలో ఐటమ్ సాంగ్ ఊ.. అంటావా మావ.. అంటూ ఓ ఊపు ఊపేసింది సామ్.
ఇటీవల సామ్ నటించిన శాకుంతలం నిరాశపరిచగా.. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది సామ్. వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలాఉండగా సమంత, వరుణ్ ధావన్ సెర్బియాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గౌరవనీయులైన భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం కలిగింది. సెర్బియాలో ద్రౌపది ముర్ము మేడంను కలిశాం.. మిమ్మల్ని కలవడం ఎంతో గొప్ప ఆనందాన్ని, గౌరవాన్ని ఇచ్చింది అంటూ రాసుకొచ్చారు వరుణ్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Team Citadel India had the privilege of meeting the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji in Serbia. What an absolute joy and honour to meet you ma’am @presidentofindia 🇮🇳 pic.twitter.com/OU6J5cD9hy
— VarunDhawan (@Varun_dvn) June 8, 2023