Lakshmi Puja : శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆరోజు లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్నటువంటి అరిష్టాలు తొలగిపోయి, మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అయితే లక్ష్మీదేవిని ఎలా పూజించాలో కూడా ఒక పద్ధతి, నియమం ఉంటుంది. ఆ రకంగా పూజిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలామంది ఇబ్బంది పడేది ఆర్థిక సమస్యలతోనే, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని చెప్తారు.
ముఖ్యంగా ఈ పూజ వల్ల ఐశ్వర్యం, ధన ప్రాప్తి, సుఖ,సంతోషాలు ఆస్తి వంటివి లక్ష్మీదేవిని పూజిస్తే కలుగుతాయని మనకు ఆధ్యాత్మిక వాదులు తెలియజేస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వులతో, లేదా గులాబీ పువ్వులతో పూజించాలి. ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి పూజలో పాల్గొంటే మీకు త్వరగా కోరికలు నెరవేరుతాయి.
అలాగే లక్ష్మీ సూక్తాన్ని పాటించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, మీకు ఉన్నటువంటి అరిష్టాలు కనుమరుగయి, పాపప్రక్షాళన జరుగుతుంది. సంతానలేని సమస్యతో బాధపడేవారు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కనకధారా స్తోత్రం జపిస్తూ ఆ అమ్మ వారిని పూజిస్తే శుభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే పూజా స్థలంలో సోమ పుష్య యోగంలో దక్షిణవర్తి శంఖాన్ని ప్రతిష్టించించి ,స్మరిస్తే విష్ణు మూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది.