Lakshmi Puja : శ్రావణమాసం వచ్చిందంటే అందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఆ లక్ష్మీ దేవతను ఆరాధిస్తూ ఆమె కరుణాకటాక్షాలు తమపై ఉండాలని వేడుకుంటారు. అయితే లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి. ఎటువంటి పూలతో ఆమెకు పూజ చేస్తే పూజకు తగ్గ ప్రతిఫలం మనకు దక్కుతుందో లక్ష్మీదేవి ఎలా ప్రసన్న రాలవుతుందో తెలుసుకుందాం. లక్ష్మీదేవినీ శ్రావణమాసంలో పూజించేటప్పుడు ఒక పుష్పంతో మాత్రం అసలు పూజ చేయకూడదు.
పొరపాటున పూజలో ఆ పుష్పాన్ని వాడితే దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలను కూడా చవిచూడవలసి ఉంటుంది. మరి ఆ పువ్వు ఏమిటి ? లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఇంటినీ చాలా శుభ్రంగా ఉంచి మధ్యపానం చేయకుండా, మాంసాహారం తినకుండా చాలా నీతినిష్టలతో ఉండాలి. అలాగే ఇంట్లో ఆడవారు నెలసరి సమయం ఉండకుండా చూసుకోవాలి. అలా ఉన్నవారు దేవాలయాలకు వెళ్ళకూడదు.
అలాగే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మంగళ, శుక్రవారం మీరు ఎవరికి అప్పుగా ధనాన్ని ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ ఇంటికి దరిద్రం ఆవహిస్తుంది. ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం నల్లని దుస్తులు ధరించకూడదు. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే పారిజాత పుష్పాలతో ఆ తల్లిని పూజించడం ఉత్తమం. అలా పూజించడం వల్ల ఎప్పుడు ఆ తల్లి మన ఇంట్లోనే కొలువై ఉంటుంది.
పారిజాత పుష్పాలను నీళ్లలో తడిపి పూజకు ఉపయోగించాలి. ఇక పూజకు ఉపయోగించని ఉపయోగించకూడని పువ్వు ఏమిటంటే ఉమ్మెత్త పువ్వు. ఉమ్మెత్త పువ్వును లక్ష్మీదేవి పూజలో ఎట్టి పరిస్థితులలో కూడా వాడకూడదు. అలా వాడితే తీవ్ర పరిణామాలను చవి చూడవలసి ఉంటుంది. ఆర్థిక నష్టాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి పూజ విషయంలో ఆడవారు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి.