Pranaya Kalaha Mahotsavam in Tirumala : భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. వెంకటేశ్వరస్వామి నిత్యం పూజలు అందుకుంటూ, భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో,ఖచ్చితంగా ఆ వెంకన్నను దర్శించుకుని, ఆ ఏడుకొండలు ఎక్కాలని భక్తులు కోరుకుంటారు. ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు పల్లకీ ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు.
స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందా – స్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ నందకిషోర్, పేష్కార్ శ్రీ శ్రీహరి, పారుపత్తేదార్ శ్రీ తులసిప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.