What Kind of Things Should be Offered to the Temples : ప్రతి ఒక్కరికి దేవుడిని పూజించిన తర్వాత దేవుడు నుంచి అనుగ్రహం పొందాలని ఉంటుంది. వాటి కోసమే ఎన్నో రకాలుగా ఉపవాసాలు చేస్తారు. పూజలు, పునస్కారాలు, యజ్ఞలు, యాగాలు, దానధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ దేవాలయానికి ఏమి సమర్పిస్తే పాపాలు తొలగిపోయి, పుణ్యం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దేవాలయ ప్రాంగణంలో ఉన్న గోడలకు సున్నం వేయించడం, అలాగే ప్రాంగణంలో ముగ్గులు వేయించి, దేవాలయానికి కొత్త శోభ చేకూరిస్తే మహావిష్ణువు లోక ఫలాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వాటితో పాటు ఆలయానికి శంఖాన్ని దానం చేయడం వల్ల కూడా పాపాలు తొలగిపోతాయని విష్ణు పురాణంలో ఉన్నట్టు పూజారులు తెలియజేస్తున్నారు.
అలాగే శంఖం దానం చేస్తే తర్వాత మానవ జన్మ ఎత్తిన కూడా కీర్తివంతులుగానే పుడతారంట, ఆలయానికి గంటను దానం చేస్తే కూడా మహా గొప్పగా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని పురాణాల్లో రాసి ఉంది. వీటితో పాటుగా గజ్జలను, మువ్వలను దానం చేస్తే అష్టైశ్వర్యాలు పొందుతారు. ఆలయ ప్రాంగణంలో చల్లదనం కోసం పందిళ్లను నిర్మిస్తే బుద్ధిమంతులు, కీర్తిని పొందడమే కాకుండా, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు.
దేవాలయంపై రెపరెపలాడే జెండాలను మనం చూస్తూనే ఉంటాం. ఆ జెండాలను గనక దేవాలయాలకు సమర్పిస్తే సకల పాపాల నుండి విముక్తిని పొందుతారు. మనకు ఆయుష్షు కూడా పెరుగుతుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో వేదికలను మనం గమనిస్తాం. వేదికలను నిర్మించడం వల్ల పృథ్విపతి అవుతారని పురాణాల్లో రాసి ఉంది. మనోహరమైన కుంభాలను ఆలయానికి ప్రసాదిస్తే వర్ణ లోకాన్ని పొందుతారని, పురాణాల్లో రాసి ఉంది.
నాలుగు కలశాలను దానం చేసినట్లయితే, నాలుగు సముద్రాలంతా భూమి మీద సుఖాన్ని పొందుతారని, అలాగే కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందవచ్చునని, వట్టివేళ్లతో తయారుచేసిన చాపలని ఇస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని, ఆలయంలో ఉన్న గోమాతలకు గడ్డి అనేక రకాలైన సదుపాయాలను కల్పిస్తే పాపాల నుండి విముక్తి పొందవచ్చని, వీటితోపాటు దేవునికి మొఖ లేపనాన్ని, సుగంధ ద్రవ్యాలను సమర్పించితే ఉత్తమ రూప సంపదత్తిని పొందవచ్చు అని పురాణాల్లో రాసి ఉంది. ఇక ఆలస్యం చేయకుండా దేవాలయాలకు వీటిని సమర్పించి సకల అష్టైశ్వర్యాలను పొందండి.