Nagababu in Vizag : బీజేపీ తో పొత్తు పై స్పందించిన నాగబాబు..
ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 39 వ వార్డు లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,పి ఏ సి సభ్యులు నాగబాబు.
జనసేనపై తమ అభిమానాన్ని చాటుకున్న ఎన్నారైలు..ఏం చేశారంటే..
తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా అధినేత ఎక్కడ నుంచి పోటీ చేయమని నిర్ణయిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తాను అని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికలలో జనసేన టిడిపి ఎలియన్స్ 95 శాతం స్థానంలో విజయం సాధిస్తాం అనీ.. జగన్ పర్సనల్ ఎజెండా తో ఢిల్లీ వెళ్తున్నారు అంటూ ఆయన విమర్శించారు.
జగన్ ఢిల్లీ యాత్రలు పై నాకు పాజిటివ్ ఒపీనియన్ లేదు. బీజేపీ తో పొత్తు కుదురుతుందని ఆశిస్తున్నాం…పొత్తు కుదురుతుంది. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే మా ఏజండా. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషకరం గా ఉంది అనీ.. ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశం అవుతున్నాను అంటూ నాగబాబు తెలిపారు.