జర్నలిజం అంటే నేటి రోజున న్యూస్ కంటే న్యూసెన్స్ ఎక్కువవుతుంది. తమ పరిధిలో నిర్ధారణ కానీ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ తప్పుదోవ పట్టించడం పరిపాటిగా మారింది. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యం పాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. తన పరిధిలోకి వచ్చిన ఈ వార్తను నిర్ధారణ చేసుకోకుండా ప్రణబ్ ముఖర్జీ మరణించారు అంటూ రాజ్ సింగ్ సర్దేశాయి అనే జర్నలిస్టు ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు.
దీనికి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని, ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశారు. ఇది దేశంలో మీడియా పరిస్థితి కి అద్దం పడుతుంది అనీ, మీడియా ఇపుడు ఫేక్ న్యూస్ తయారు చేసే ఫ్యాక్టరీ గా మారింది అనీ ఆయన విమర్శించారు.
పరిస్థితి చేయిదాటాక ప్రణబ్ మరణించారు అంటూ పోస్టు పెట్టిన రాజ్ సింగ్ తీరిగ్గా తర్వాత అపాలజీ చెప్పారు. ఇంత నిర్లక్ష్యంగా పోస్ట్ పెట్టిన జార్నలిస్ట్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు అలా పూర్తిగా తెలుసుకోకుండా వార్త ఎలా ప్రచురిస్తారు. కొందరైతే ఇలాంటి తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టులను చెప్పుతో కొట్టాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.